English | Telugu
అత్యాచారం కేసులో చిక్కుకున్న 'ఆదిపురుష్' నిర్మాత!
Updated : Jul 16, 2021
ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, టి-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్పై అత్యాచారం కేసు నమోదవడం సంచలనం సృష్టిస్తోంది. ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం తన సంస్థలో ఒక ప్రాజెక్టులో తనను నిమగ్నం చేసే నెపంతో భూషణ్ కుమార్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 30 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టులు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఏఎన్ఐ చేసిన ట్వీట్ ప్రకారం, 30 ఏళ్ల మహిళపై అత్యాచారం ఆరోపణలతో భూషణ్ కుమార్పై ఐపీసీ 376 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది.
సందర్భవశాత్తూ 2018లో #MeToo ఉద్యమం పెల్లుబికిన కాలంలో ఒక ట్విట్టర్ వినియోగదారు భూషణ్ కుమార్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు. 'బాస్'తో పడుకోవడానికి నిరాకరించినందున తనను ఒక సినిమా నుంచి తొలగించారని ఒక మహిళ ఆ ట్వీట్లో ఆరోపించారు.
భూషణ్ కుమార్ హసీన్ దిల్రుబా, లుడో, సైనా, కబీర్ సింగ్, సత్యమేవ జయతే, ఆషికి 2, భూల్ భులయ్యా తదితర చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' సినిమాని నిర్మిస్తున్నారు. ఆయన నటి, ప్రొడ్యూసర్ అయిన దివ్య ఖోస్లాను 2005లో పెళ్లాడారు. వారికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.
