Read more!

English | Telugu

రెడ్‌లైట్ ఏరియాకు శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌?

`కొత్త బంగారు లోకం` హీరోయిన్ శ్వేతా బ‌సు ప్ర‌సాద్ ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. త‌న విడాకుల గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన శ్వేతా బ‌సు ప్ర‌సాద్ తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. ద‌ర్శ‌కుడు, స్నేహితుడైన రోహిత్ మిట్ట‌ల్‌ని పెళ్లాడి ఏడాది తిర‌క్కుండానే విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే.  

టాలీవుడ్‌లో కెరీర్ ముగిసిన సంద‌ర్భంలో శ్వేతా బ‌సుప్ర‌సాద్ సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని తిరిగి ముంబైకి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఇష్యూ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సంఘ‌ట‌న మ‌రిచిపోయి ప్ర‌స్తుతం ఒంట‌రి జీవితాన్ని సాగిస్తున్న శ్వేతాబ‌సు మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి సారించింది.

త్వ‌ర‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు, జాతీయ అవార్డు గ్ర‌హీత మ‌ధూర్ బండార్క‌ర్ రూపొందించ‌నున్న చిత్రంలో సెక్స్ వ‌ర్క‌ర్‌గా న‌టించ‌బోతోంది. ఇందు కోసం ముంబై రెడ్ లైట్ ఏరియాల్లోని సెక్స్ వ‌ర్క‌ర్ల‌ని క‌లిసి వారి జీవితాల‌ని అధ్య‌య‌నం చేస్తోంది. కామాటిపుర‌లో ద‌ర్శ‌కుడు మ‌ధుర్ బండార్క‌ర్‌తో క‌లిసి అక్క‌డి సెక్స్ వ‌ర్క‌ర్ల గురించి తెలుసుకుంటోంది. కామాటిపుర‌కు చెందిన సెక్స్ వ‌ర్క‌ర్లు లాక్‌డౌన్ స‌మ‌యంలో దుర్భ‌ర జీవితాల్ని ఎదుర్కొన్నారు. ఆ అంశాన్నే ప్ర‌ధాన క‌థ‌గా తీసుకుని మ‌ధూర్ బండార్క‌ర్ సినిమా చేయ‌బోతున్నారు. అందులో శ్వేతా బ‌సు ప్ర‌సాద్ కామాటిపుర‌కు చెందిన‌ సెక్స్ వ‌ర్క‌ర్‌గా క‌నిపించ‌బోతోంది.