English | Telugu
రణ్ వీర్, ఆలియా జోడీ.. ఓ సెంటిమెంట్!
Updated : Jul 14, 2022
`గల్లీ బాయ్` (2019) వంటి విజయవంతమైన చిత్రంలో జోడీగా సందడి చేశారు రణ్ వీర్ సింగ్, ఆలియా భట్. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ`లో జంటగా నటిస్తున్నారు ఈ క్యూట్ పెయిర్. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాని ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి మేటి తారలు ఇందులో ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కాగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2023 ఫిబ్రవరి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. రణ్ వీర్, ఆలియా ఫస్ట్ జాయింట్ వెంచర్ అయిన `గల్లీ బాయ్` కూడా గతంలో ఫిబ్రవరి నెలలోనే రిలీజైంది. 2019 ఫిబ్రవరి 14న విడుదలైన సదరు చిత్రం రణ్ వీర్, ఆలియా కెరీర్ లో మంచి విజయం సాధించడమే కాకుండా, వారికి పలు అవార్డులను అందించింది. మరి.. ఫిబ్రవరి సెంటిమెంట్ తోనే రాబోతున్న `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ` కూడా `గల్లీ బాయ్` బాటలో పయనించి.. రణ్ వీర్, ఆలియా జోడీకి మరో మెమరబుల్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.