Read more!

English | Telugu

ర‌ష్మిక ఫ‌స్ట్ బాలీవుడ్ ఫిల్మ్ 'మిష‌న్ మ‌జ్ను' షూట్ షురూ!

 

క్రేజీ హీరోయిన్ ర‌ష్మికా మంద‌న్న న‌టిస్తోన్న ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ 'మిష‌న్ మ‌జ్ను' షూటింగ్ గురువారం మొద‌లైంది. ఇందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరో రోల్ చేస్తున్నాడు. త‌మ ఫ‌స్ట్ డే షూటింగ్‌కు సంబంధించిన ఓ పిక్చ‌ర్‌ను ర‌ష్మిక త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఆ పిక్చ‌ర్‌లో ర‌ష్మిక‌, సిద్ధార్థ్ ఇద్ద‌రూ స్పైర‌ల్ బైండింగ్ చేసిన బుక్స్‌ను ప‌ట్టుకొని ఉన్నారు. అవి 'మిష‌న్ మ‌జ్ను' స్క్రిప్ట్ బుక్స్ అని తెలుస్తోంది. ఆ ఫొటోతో పాటు "Ahhhh... I sooooo can’t wait to join my team. Let the mission start!!! #MissionMajnu" అంటూ క్యాప్ష‌న్ జోడించింది క‌న్న‌డ చందం. ఆమె గ్రీన్ స‌ల్వార్ క‌మీజ్ ధ‌రించ‌గా, సిద్ధార్థ్ హాఫ్ జాకెట్ ఉన్న ప‌ఠానీ సూట్ వేసుకున్నాడు.

స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని శంత‌న్ బాగ్చి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో 'రా' ఏజెంట్‌గా సిద్ధార్థ్ మ‌ల్హోత్రా క‌నిపించ‌నున్నాడు. పాకిస్తాన్‌లో ఓ కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా త‌యార‌వుతోంది. "సిద్ధార్థ్‌తో షూటింగ్ చేయ‌డానికి మొత్తం టీమ్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆ రోజు వ‌చ్చేసింది." అని చెప్పాడు శంత‌న్‌. ఈ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ను 2020 డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేశారు. అందులోనే "ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్" అంటూ తెలియ‌జేశారు. 

ర‌ష్మిక ఫ‌స్ట్ త‌మిళ్ ఫిల్మ్ 'సుల్తాన్' షూటింగ్ పూర్త‌యి, ఏప్రిల్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో కార్తీ హీరో. ఇక తెలుగులో ఆమె అల్లు అర్జున్ జోడీగా 'పుష్ప'‌, శ‌ర్వానంద్ స‌ర‌స‌న 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.