English | Telugu
శ్రీమతికి 120 కోట్లతో అపురూపమైన బహుమానం!
Updated : Jan 5, 2023
భార్యలకు బహుమతులు ఇచ్చేవారు తమ స్థాయిని బట్టి ఆయా బహుమతులను ఎంచుకుంటారు. పెద్దగా స్థోమత ఏమీ లేని వారు అయితే పూలతో సరిపెడతారు. కాస్త ఉన్నవారైతే చీరలు కొనిస్తారు. మరి కొంచెం ఉన్నవారైతే బంగారు నగలు చేయిస్తారు. ఇలా పిండి కొద్ది రొట్టె అన్నట్టు స్తోమతను బట్టి బహుమతి అనేది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన భార్యకు ఓ భారీనౌకని బహుమతిగా ఇచ్చారని చాలా కాలం కిందట మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ జంట చూడముచ్చటైనది. వీరెప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూనే ఉంటారు. ఆమధ్య వీరు విడిపోయారు అని పుకార్లు వచ్చాయి. కానీ వీరిది విడిపోయేంత బలహీనమైన బంధం కాదని మరోసారి నిరూపితమైంది. ఇద్దరి బంధం అపురూపమని బాలీవుడ్ వర్గాలు వారు అంటున్నారు.
ఇద్దరూ కూడా బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఏడాదికి వీరి ఆదాయం దాదాపు రూ. 100 కోట్ల పై మాటే అంటున్నారు. ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియాలో నిర్మించిన ప్రత్యేక ఇంట్లో కొత్త సంవత్సరం సందర్భంగా వీరు అడుగుపెట్టారు. దీపిక అభిరుచికి అనుగుణంగా దాదాపు 12000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించారు. రెండు మూడు నెలలు ప్రత్యేకంగా రణవీర్ శ్రద్ధ పెట్టి మరి ఇంటి ఫినిషింగ్ పూర్తి చేయించారు. ఇంటి కోసం రణవీర్ సింగ్ ఏకంగా రూ. 120 కోట్లు ఖర్చు చేశారు అని చెబుతున్నారు. ఈ ఇల్లు షారుక్, సల్మాన్ ఖాన్ ఇళ్లకు సమీపంలో ఉంటుందట.
అద్భుతమైన టెర్రస్, సముద్రపు వ్యూ, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటితో ఈ ఇల్లు అత్యంత విలాసంగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రతి మూల కూడా అధునాతన ఇంటీరియల్ తో డిజైన్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇలా రూ. 120 కోట్లతో నిర్మించిన ఇంద్రభవనం వంటి ఇంటిని కొత్త సంవత్సరం కానుకగా దీపికాకు రణవీర్ సింగ్ అందజేశారు. కొత్త సంవత్సర వేడుకలను కూడా ఈ కొత్త ఇంట్లో వీరు చాలా వేడుకగా జరుపుకున్నారని సమాచారం.