Read more!

English | Telugu

4 వారాలు.. 3 సినిమాలు.. ప‌రిణీతి చోప్రా లెక్కే వేర‌ప్ప‌!

హిందీనాట దాదాపు ప‌దేళ్ళుగా క‌థానాయిక‌గా అల‌రిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.  గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంకా చోప్రా క‌జిన్ గా బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైనా.. న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది ప‌రిణీతి. కెరీర్ ఆరంభంలో బాగా దూకుడు చూపించిన ఈ అమ్మ‌డు.. క్ర‌మంగా నెమ్మ‌దించింది. అయితే, ఈ మ‌ధ్య మ‌ళ్ళీ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది.

మ‌రీ ముఖ్యంగా.. కేవ‌లం 4 వారాల వ్య‌వ‌ధిలో 3 చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తూ టాక్ ఆఫ్ బాలీవుడ్ అయింది మిస్ చోప్రా. ఫిబ్ర‌వ‌రి 26న నెట్ ఫ్లిక్స్ మూవీ `ద గాళ్ ఆన్ ద ట్రైన్`తో ఆక‌ట్టుకున్న ప‌రిణీతి.. ఈ నెల 19న `సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్`తో థియేట‌ర్స్ లోకి రానుంది. `ఇష్క్ జాదే`, `న‌మ‌స్తే ఇంగ్లాండ్` త‌రువాత అర్జున్ క‌పూర్ తో ప‌రిణీతి జోడీ క‌ట్టిన ఈ సినిమాపై చెప్పుకోద‌గ్గ అంచ‌నాలే ఉన్నాయి.

ఇక మార్చి 26న బ్యాడ్మింట‌‌న్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన `సైనా`తో ఎంటర్ టైన్ చేయ‌నుంది ప‌రిణీతి చోప్రా. ఈ పాత్ర కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుని మ‌రీ న‌టించింది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

మ‌రి.. `ద గాళ్ ఆన్ ద ట్రైన్`కి మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాలు ప‌రిణీతి చోప్రాకి ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తాయో చూడాలి.