Read more!

English | Telugu

క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ వెడ్డింగ్ కార్డ్ లీక్‌!

 

అందరి దృష్టి కత్రినా కైఫ్, విక్కీ కౌశ‌ల్‌ గ్రాండ్ వెడ్డింగ్ పైనే ఉంది. క‌త్రినా తన కుటుంబంతో రెండు రోజుల క్రితం జైపూర్‌కు బయలుదేరి వెళ్లింది. రాజ‌స్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఉన్న‌ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా రిసార్ట్‌లో వారి వివాహం జరగనుంది. వేదిక చుట్టూ భద్రతను చాలా కట్టుదిట్టంగా చేశార‌ని మ‌న‌కు తెలుసు. నిజానికి పెళ్లికి వెళ్లే అతిథులు కూడా ఇంత‌దాకా నోరు మెదపలేదు. ముంబై ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల‌కు విక్కీ కౌశల్ న‌వ్వుతూ పోజులిచ్చాడు. ఇప్పుడు, కత్రినా కైఫ్ అభిమాన సంఘం వెడ్డింగ్‌ కార్డు పిక్చ‌ర్‌ను షేర్ చేసింది. ఇది తెలుపు రంగుతో వారి అభిరుచిని తెలియ‌జేస్తోంది. 

Also read:  క‌త్రినా-విక్కీ వెడ్డింగ్ ఫుటేజ్‌కు రూ. 100 కోట్ల ఆఫ‌ర్ చేసిన ఓటీటీ దిగ్గ‌జం!

డిసెంబర్ 9న పెళ్లి జరగనుంది. ఈరోజు మెహెందీ, సంగీత్ వేడుకలు జరుగుతున్నాయి. విక్కీ కుటుంబం కత్రినా కైఫ్ కోసం ప్రత్యేకంగా సంగీత్ ఫంక్ష‌న్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఆమెకు సంప్రదాయ స్వాగతం ఇవ్వ‌డంతో పాటు, పంజాబీ వంట‌కాల రుచుల్ని అందించాలనుకుంటున్నారు. చూస్తుంటే.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ టీమ్ చాలా పెద్దదిగా క‌నిపిస్తోంది. పెళ్లి కోసం ముంబై నుంచి 100 ర‌కాల స్వీట్స్‌ను తెప్పించార‌ని రూమ‌ర్స్‌ వచ్చాయి. అతిథులకు బ్రోకలీ, బచ్చలికూర, పుట్టగొడుగుల వంటి ప్రత్యేక కూరగాయలు కర్ణాటక నుంచి కూడా వస్తున్నాయని మరో రిపోర్ట్ చెప్పింది. Also read:  క‌త్రినా-విక్కీ పెళ్లి.. అతిథులు బ‌స‌చేసే ఒక్కో టెంట్ అద్దె ఒక్క రాత్రికి 70 వేల పైమాటే!

క‌త్రినా-విక్కీ జంట తమ పెళ్లి వార్తలను గోప్యంగా ఉంచారు. రేపు పెళ్లి అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వరకు వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మ‌ధ్య‌లో సవాయి మాధోపూర్ పాలకవర్గం రోడ్లపై దుమ్ము రేగ‌కుండా ఉండ‌టానికి వాట‌ర్ పెట్టింది. స్థానికులు సైతం వధూవరులను చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో కట్టుదిట్టమైన నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. అన్ని కోవిడ్-19 నియమాలను ప్రతి ఒక్కరూ క‌చ్చితంగా పాటించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లి వేదిక ద‌గ్గ‌ర‌కు మాళవిక మోహనన్, రాధిక మదన్, నేహా ధూపియా, గురుదాస్ మాన్, కబీర్ ఖాన్ చేరుకున్నారు.