Read more!

English | Telugu

8 రోజుల నుంచి నరకం అనుభవిస్తున్న టాప్ హీరోయిన్ 

2015 లో బాలీవుడ్ లో వచ్చిన ధమ్ లగా కి హైషా అనే హిందీ చిత్రంతో పరిచయమైన నటి భూమి ఫేడ్నేకర్. ఆ తర్వాత వచ్చిన టాయిలెట్ సినిమాతో  ఫేడ్నేకర్  పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇలా ఎన్నో సినిమాల్లో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించి  భూమి  మంచి నటి అనే పేరుని ప్రేక్షకుల్లో సంపాదించుకుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ తో పాటు కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి.

భూమి  ఫేడ్నేకర్ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతు హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. ఒక దోమ కుట్టడం వల్ల ఆమె కి ఆ డెంగ్యూ జ్వరం వచ్చింది.ఈ విషయమై  హాస్పిటల్ నుంచి తన ఫోటోలు విడుదల చేసిన  ఆమె  ప్రజలకి కొన్ని సూచనల్ని చేసింది. ప్రతి ఒక్కరు డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఉండాలంటే మీ చుట్టు ఉన్న వాతావరణాన్నిఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. పొల్యూషన్ లో ఎక్కువగా తిరగకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా  రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తో పాటు దోమల ని నివారించడానికి మస్కిటోస్ కూడా వాడాలని చెప్పింది. ఒక దోమ వల్ల ఎనిమిది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్న నేను  చాలా రోజుల తర్వాత ఉదయాన్నే నిద్రలేచాను. పైగా ఇన్నిరోజులు నా ఫ్యామిలీ కి  దూరంగా ఉంటూ నరకం అనుభవిస్తున్నాను అని కూడా  ఫేడ్నేకర్  చెప్పుకొచ్చింది.

ఇటీవలే భూమి ఫేడ్నేకర్  నటించిన ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అలాగే మొన్న నవంబర్ 3 న అర్జున్ కపూర్ తో కలిసి తాను చేసిన థాంక్యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ విడుదల అయ్యింది.ఇప్పుడు మళ్ళీ అర్జున్ కపూర్ తోనే  ఆమె  ఇంకో కొత్త చిత్రంలో నటించబోతుంది.