English | Telugu

బిగ్ బాస్ ఎఫెక్ట్.. భర్తతో విడాకులు ప్రకటించిన రాఖీ సావంత్!

ఇటీవల సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా చేరిపోయింది. తన భర్త రితేష్ సింగ్ నుంచి విడిపోతున్నట్లు ఆదివారం సాయంత్రం ఆమె ప్రకటించింది.

మోడల్ గా, నటిగా, డాన్సర్ గా, హోస్ట్ గా ప్రేక్షకులను అలరించిన రాఖీ సావంత్ విడాకుల ప్రకటనతో తాజాగా వార్తల్లో నిలిచింది. ఆమె హిందీ బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడమే కాకుండా.. బిగ్ బాస్ 14, 15 సీజన్స్ లో సందడి చేసింది. అయితే ఇప్పుడు ఆ బిగ్ బాస్ షోనే వారి విడాకులకు కారణమైందని తెలుస్తోంది.

"రితేష్, నేను విడిపోయి మా దారులు మేం చూసుకోవాలి అనుకుంటున్నాం. బిగ్ బాస్ తర్వాత మా మధ్య తలెత్తిన విభేదాలు చేజరిపోయాయి. విభేదాలు తొలగించుకునేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ సాధ్యం కాలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వాలెంటైన్స్ డే సమయంలో ఇలా జరగడం బాధగా ఉంది. రితేష్ కి తన జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇకపై నా దృష్టంతా నా లైఫ్, నా కెరీర్ పై పెట్టి హ్యాపీగా జీవించాలి అనుకుంటున్నాను" అని రాఖీ సావంత్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఒక నోట్ విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, తెలుగు బిగ్ బాస్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రేయసి దీప్తి సునైనాతో విడిపోయిన సంగతి తెలిసిందే.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.