Read more!

English | Telugu

నేను డేటింగ్ లో ఉంది నిజమే...అతనికి పెళ్లయ్యింది

సాధారణంగా సినిమా వాళ్ళు ఎలాంటి ఇష్యుల జోలికి వెళ్లరు. ఎందుకంటే వాటి వల్ల ఎన్నో ఆశలు పెట్టుకున్న  తమ సినిమా కెరీర్ కి ఎక్కడ ఇబ్బంది ఏర్పడుతుందో అని తమ సినిమా లోకంలో బతుకుతు ఉంటారు. కానీ హీరోయిన్  కంగనా రనౌత్ మాత్రం అలాంటి లాజిక్ లకి పూర్తిగా విరుద్ధం.సినిమాలకి సంబంధించిన విషయాలలోనే కాదు పొలిటికల్ గా కూడా    దేశానికి సంబంధించిన చాలా విషయాల పైన  నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. తాజాగా ఆమెకి ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా వచ్చింది. తాజాగా ఆమె తన  పర్సనల్ విషయం గురించి  సూటిగా సమాధానం చెప్పి కంగనా నా మజాకానా అనిపించింది

కంగనా రనౌత్  మొన్న అయోధ్య లో జరిగిన బాల రాముని విగ్రహ  ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ సంధర్భంలో  ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్ఠితో  కొన్ని ఫొటోస్ దిగింది. దీంతో  సోషల్ మీడియాలో ఆ       పిక్స్ చూసిన చాలా మంది  కంగనా, నిశాంత్ తో డేటింగ్ లో ఉందనే కామెంట్స్ ని చేస్తున్నారు. దీంతో కంగనా రంగంలో దిగి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది.పిట్ఠితో  నేను డేటింగ్ లో ఉన్నాననే ప్రచారం పూర్తిగా అబద్దమని ఆయనకి ఆల్రెడీ  పెళ్లయిందని ఎవరు కూడా ఆ వార్తలని నమ్మవద్దని చెప్పింది. ఒక వ్యక్తితో ఫోటో దిగినంత మాత్రాన అతనితో డేటింగ్ లో ఉన్నాననడం  చాలా తప్పని తన  ఆగ్రహాన్ని కూడా  వ్యక్తం చేసింది.అలాగే తాను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని సరైన సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరు  చెప్తానని కూడా కంగనా చెప్పింది.

కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ  అనే మూవీలో నటిస్తుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇండియా ఎలా ఉంది అనే పాయింట్ తో  తెరకెక్కుతున్నఈ మూవీ జూన్ 14 న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా తన నటవిశ్వరూపాన్ని చూపించబోతుందనే టాక్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వినపడుతుంది