Facebook Twitter
నాడు రతనాలవీణ...నేడు నిప్పులవాన..?

నాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ
నిజమే నేడు నిర్భంధ నిరంకుశ పాలనలో
ప్రతిగుండెలో కురిసేనట...ఓ నిప్పులవాన

తెలంగాణ
రాష్ట్ర సాధనలో
12000 మంది యువతీ
యువకులు అమరులయ్యారంట...

తేనెలమాటల తెల్లదొర గద్దెనెక్కగానే
కుటుంబమంతా ఖుషీ ఆయెనంట...
కట్టిన భారీప్రాజెక్టులతో ఎండిన బీడు
భూములు సస్యశ్యామలమాయెనంట...
నిన్న కష్టేఫలి అంట నేడు కలలు పండేనంట
ఆ ఇంట గలగలమంటూ కాసుల పంటేనంట

32 లక్షల నిరుద్యోగుల ఆవేదనలు
ఆక్రందనలు అరణ్య రోదనలాయెనంట...

కోట్లు ఖర్చుచేసి భారీ సభలు పెట్టెనంట...
గోడదూకిన గొర్రెలకు గొప్ప సన్మానాలంట...
బిగ్ బాస్  ‌బిజినెస్ మ్యాన్ గా మారెనంట...
కులానికో సంక్షేమభవన్ శాంక్షన్ ఆయెనంట

సంక్షేమ పథకాలెన్నో ...పెట్టెనంట
డబుల్ బెడ్ రూంల ఇళ్ళెన్నో...కట్టెనంట
స్వామి కార్యం స్వకార్యం...జరిగెనంట

ప్రతిఘటించే ప్రత్యర్థులపై కేసులంట...
ప్రశ్నించే గొంతుకలపై కలం కత్తి పోటంట...
బంగారు తెలంగాణ కల భగ్నమాయెనంట
ఉద్యోగుల్ని...ఉద్యమకారుల్ని...
నిరుద్యోగుల నిట్టూర్పుల్ని...
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
రెప్పపాటున కుప్పకూలిపోయిరంట...

ఏ‌ ప్రలోభాలకు లొంగని...
తెలివిగల ఓటర్ దేవుళ్ళు...
తిరుగులేని తీర్పునిచ్చిరంట...
కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిరంట...
తెలంగాణాను మరో కర్ణాటకగా మార్చిరంట.