"నేనే రాజును
"రారాజును"
"మకుటంలేని మహారాజును"
"ఇది నా అడ్డా"
"నా ఎకెదురు లేదు"
"నన్నోడించేవాడింకా పుట్టలేదు"
అంటూ మురిసిపోతారు మూర్ఖులు..
కాదు "బిడ్డా"
ఇది "ప్రజల ఆస్తి"
ఇది "ప్రజాస్వామ్యం"
ఇది "ప్రజాప్రభుత్వం"
ప్రజలే "రాజులు"అంటే
విరగబడి నవ్వి...
వికటాట్టహాసం చేస్తూ...
"ఇది నా బంగారు సింహాసనం"
"దీన్నెవరూ ఆక్రమించుకోలేరు"
"ఇది నా కంచుకోట"
"ఇది నా రాజమందిరం"
"దీనిలోకెవరూ ప్రవేశించలేరు"
అంటూ అధికారగర్వంతో విర్రవీగే
ప్రజానాయకుల..."రాక్షస పాలన"
పాపం పండి పదేళ్లకే పతనమైపోయె...
అనుభవం పండితేనేమి ?
అహం తలకెక్కిన ప్రజానాయకులు
"అహంకారులందరూ అధఃపాతాళానికే"...
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే...
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా....
సకలజనులు సుఖశాంతులతో
సుభిక్షంగా సురక్షితంగా ఉండేలా
సుపరిపాలన అందించే...నిస్వార్థపరులైన
"ఉత్తములందరూ ఉన్నత శిఖరాలకే"...
అట్టి ఘనులు త్యాగధనులు చరిత్రలో
చిరంజీవులే...నిత్యం చిరస్మరణీయులే...



