బైబిల్ గ్రంధం చెబుతోంది
ఇజ్రాయెల్ పాలు తేనెలు
ప్రవహించిన పవిత్ర దేశమని
నేడు అమాయకపు ప్రజల
రక్తం ఏరులై ప్రవహిస్తున్న
భద్రత కరువై భయంతో
ప్రజలు బంకర్లలో
బ్రతుకుతున్న ఓ చిన్న
దేశం ఇజ్రాయేల్ దేశం...
ఎన్నో ఏళ్ళతరబడి
ఇరుగు పొరుగు దేశాలతో
ఎన్నో యుద్ధాలు చేసింది
శత్రువులను హతమార్చింది
ఎందరినో పౌరులను
యుధ్దవీరులను కోల్పోయింది
ఇజ్రాయేల్ దేశం...ఐనా
నేడు ప్రపంచంలో అత్యాధునిక
రక్షణ వ్యవస్థ కలిగిన అత్యంత
శక్తివంతమైన దేశం ఇజ్రాయేల్ దేశం.
ఈ చిన్న
క్రిష్టియన్ కంట్రీకి
చుట్టూ ఉన్నది
అత్యాధునికమైన
మారణాయుధాలు...
ధరించిన శత్రుమూకలే...
గుంటనక్కలే గుడ్లగూబలే...
కయ్యానికి కాలు దువ్వే
కసితో బుసలు కొట్టే కాలనాగులే...
చుట్టూ ఆకలితో
అక్కసుతో ఉన్న అరబ్బుదేశాలే....
నిజమే ఇజ్రాయెల్
నేడు సింహాల బోనులో
చిక్కుకున్న దానియేలే...అది
కత్తుల బోనులో ఉన్న సింహమే
ఐనా సింహం సింగిల్ గా వస్తుంది
గొర్రెలు మేకలే గుంపులుగా వస్తాయి
అక్టోబర్ 7న
20 నిమిషాలలో
5000 రాకెట్లు విసిరిన
తనతోకను త్రొక్కిన...
భూగర్భ సొరంగాలలో నక్కిన...
222 ముందితన దేశ పౌరులను
సైనికులనుబంధీలుగా చేసినందుకు..
11 లక్షల మంది పాలస్తీనా ప్రజలను
దక్షిణ దిక్కుకు పంపి గాజాను గాలించి
హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు...
శత్రుమూకల్ని మట్టు పెట్టేంతవరకు...
ఆ భూగర్భ సొరంగాలనే అతిపెద్ద
సమాధులుగా మార్చేంతవరకు...
కునుకు తియ్యనని...వెనుతిరగనని...
ప్రతిన పూనిన దేశం ఇజ్రాయేల్ దేశం...



