ఓటుకు నోటుకు
రాజకీయ నాయకుల
ఓటమికి ఘన విజయానికి
తలలు పండిన
నేతల తలరాతలు సైతం
తల్లక్రిందులవడానికి
రాత్రికిరాత్రే జాతీయనాయకుల
జాతకాలు మారిపోవడానికి
అదృశ్యంగా అర్థంకాని
ఏదో లింకు ఉన్నట్లే...సందేహం లేదు
నిన్నటి కర్ణాటక ఫలితం
రాజకీయ నాయకుల
గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది
బడా నాయకుల
గుండెల్లో గుబులు రేపింది
కారణం రాజకీయాల్లో
రాణించాలంటే "ఓటుతో నోటును"
కొనుక్కోవడమొక్కటే సులువైన మార్గం
నిన్నటి వరకు
ప్రజలను దోచుకొన్న
తాము బ్యాంకు లాకర్లలో
భద్రంగా దాచుకున్న 2000 నోటుపై
ప్రభుత్వం "గొడ్డలి వేటు" వేసింది
మాయదారి కేంద్రం మాస్టర్ ప్లాన్ వేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2000 రూపాయల నోటును రద్దుచేసింది
కొందరు బడాబాబులకు
కంటిమీద కునుకు లేకుండా చేసింది...
దొరల దొంగదారుల వేట మొదలైంది...
త్వరలో రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వం...ప్రతిపక్షం
రెండు గెలుపు అధికారమే లక్ష్యంగా
"ఓట్లకోసం నోట్లయుద్ధం"ప్రారంభించాయి



