Facebook Twitter
దక్షిణ ధృవంపై భారత్ విజయకేతనం

ఏ దేశమేగినా...
ఎందు కాలిడినా...
పొగడరా ఈ ఇస్రో
చంద్రయాన్ - 3
విజయగాథను...
అని ఓకవి పలికినట్టు...

తెలుగునేల
నెల్లూరు జిల్లా
శ్రీహరి కోటనుండి...

1000 మంది
భారతీయ శాస్త్రవేత్తలు
తిండి నిద్ర జీవనమే
చంద్రయాన్ - 3 కాగా
అకుంఠిత దీక్షతో...
అంకితభావంతో...
4 ఏళ్ళ నిరంతరం కృషికి
నిదర్శనంగా రూపకల్పన చేసిన...

615 కోట్ల ఖరీదైన...
3915 కిలోల బరువైన...
చంద్రయాన్ - 3 అంతరిక్ష నౌక

14 జూలై 2023...
మధ్యాహ్నం 2.35
నిముషాల సుముహూర్తానికి...

140 కోట్ల మంది
భారతీయులు గర్వపడేలా...
నిప్పులు చెరుగుతూ నింగికెగిసి...

భూమికి దూరంగా
3,84,800 కిలోమీటర్లు
41 రోజుల సుధీర్ఘ ప్రయాణం చేసి
ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళని దారిలో...

అగ్రరాజ్యాలు
సైతం అసాధ్యమని
ఆశలు వదులుకున్న ఏ దేశం
సాహసించని చంద్రుని దక్షిణధృవానికి...

23 ఆగస్టు 2023...
సాయంత్రం 6.04 నిముషాలకు
సూర్యోదయం వేళ...
అనేక క్లిష్టమైన దశలను దాటి...
సాప్ట్ ల్యాండింగ్ చేసి...
చంద్రునిపై ఒక పగటి పూట...
(భూమిపై 14 రోజుల) పరిశోధనలకు...
విక్రమ్ ల్యాండర్...ప్రగ్యాన్ రోవర్ లు
విశ్వమే విస్తుపోయేలా విజయవంతంగా
"చల్లని చంద్రుని ఒడిని " చేరినవేళ...

ప్రజలు టీవీలకు అతుక్కుని
ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ...
గడిపిన ఆ క్షణాలు అత్యంత
ఉత్కంఠ పూరితం...ఉద్వేగ భరితం...
ఉత్కృష్టమైన చంద్రయాన్ - 3 తో ఇస్రో
చేపట్టిన ఈ"సాహసయాత్ర"విజయవంతం

జయహో...జయహో ఇస్రో జయహో
జయహో...జయహో సోమనాథ్ జయహో
జయహో...జయహో ఇస్రో శాస్త్రవేత్తలారా
జయహో...జయహో జయహో...
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...
చంద్రుని దక్షిణధృవంపై...కాలుమోపి
చరిత్ర సృష్టించిన...ఏకైక దేశం...
అఖండ భారత్ జయహో...జయహో...