నాటి కరోనా
మహమ్మారికి
బలైపోయిన
ప్రపంచ కుబేరులెందరో
"సమాధులనుండి
పంపిన సందేశం" ఒక్కటే...
నాదినాది
అనుకున్నదేదీ
నీదికాదని...
నిన్న ఎవరికో చెందింది
నేడు నీకు అందిందని...
నేడు నీకు చెందింది...
రేపు మరెవరికో అందుతుందని...
అందుకే నీవెందుకు
బాధపడతావు..?
వస్తూ వస్తూ నీవేమీ తెచ్చావని..?
కాటికి పోతూపోతూ చేత
నీవేమి పట్టుకు పోదామని..?
నీవేమి మూటకట్టుకు పోదామని..?
ఆశపడి శ్రమపడి భ్రమపడి అంతులేని
ఈ అక్రమ ఆస్తుల ఆర్జన...ఎందుకని..?
ఏదీ నీ వెంటరాదంటారు... ఔను
నీ చేతిలో సెల్ ఫోనైనా" నీవెంట...నో
నీ "వ్రేలికున్న ఉంగరమైనా"నీవెంట...నో
నీ "జేబులో పెన్నైనా"నీవెంట...నో
నీ "కాలి మన్నైనా"నీవెంట ...నో కారణం
(స్నానం చేయిస్తారు గనుక)...చివరికి
నీ "ఇంట్లో చీపురు పుల్లైనా"నీవెంట...నో ...
కాదనలేని కారణమొక్కటే...
నీవు ఖాళీ చేతులతో వచ్చావు...
తిరిగి ఖాళీచేతులతోనే కాటికెళతావు...
