థాయి వెజ్ నూడుల్స్

 

 

 

నూడుల్స్ లో చాలా రకాలు ఉన్నా అందరు ఎక్కువగా ఇష్టపడేది థాయి నూడుల్స్ నే అని చెప్పాలి. అన్నిటికన్నా కాస్త రుచిలో తేడాగా ఉంది, కరకరలాడే కూరగాయలతో తింటే నోటికి భలే రుచినిస్తాయి. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

 

కావలసిన పదార్థాలు:

నూడుల్స్ – 200 గ్రా
కేరట్
బీన్స్
కాప్సికం
బేబీ కార్న్
క్యాబేజి (అన్ని కూరగాయలు కలిపి 1/2 కిలో)
మైదా – 50 గ్రా
కార్న్ ఫ్లోర్ – 100 గ్రా
సోయా సాస్ – 1 స్పూన్
వెనిగర్ – 1 స్పూన్
టొమాటో సాస్ – 1 స్పూన్
అజినోమాటో – చిటికెడు
పండుమిర్చి ముద్ద – 1 స్పూన్
పచ్చిమిర్చి – 5
ఉప్పు, నూనె – తగినంత

 

తయారు చేసే విధానం:

ముందుగా నూడుల్స్ ని ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఉడుకిన్చేతప్పుడు కొద్దిగా నూనె వేసి వాటిని కన్నాల గిన్నాలి వడబోసేటప్పుడు చల్ల నీళ్ళతో కడిగితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. తరువాత అన్ని కూరగాయల్ని పొడుగ్గా, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్ పండుమిర్చి ముద్ద ఉప్పు వేసి అందులో కూరగాయ ముక్కలన్నిటిని వేసి ఆ పిండికి పట్టించి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి. అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి అందులో మైదా కార్న్ ఫ్లోర్ పట్టించిన కూరల్ని వేసి కరకరలాడేలా వేయించాలి. నూడుల్స్ ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన తరువాత ఒక నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనే వేసి పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, అజినోమాటో వేసి కాస్త వేగాకా అందులో కూరగాయముక్కల్ని వేసి 2 నిమిషాలు వేయించాకా చివరగా నూడుల్స్ ని కూడా వేసి వేయించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు. తాయి నూడుల్స్ మీ ముందు రెడీగా ఉంటాయి.

 

...కళ్యాణి