కాజూ మష్రూమ్ మసాలా

కావాల్సిన పదార్ధాలు:

టొమాటోలు - మూడు

అల్లం - చిన్న ముక్క

జీడిపప్పు (15 mins నానబెట్టినది) - పావు కప్పు

పచ్చిమిర్చి - మూడు

వెల్లూలి - నాలుగు

యాలుకలు - రెండు

లవంగాలు - మూడు

ఎండు మిర్చి - రెండు

మిరియాలు - అర టేబుల్ స్పూన్

మీగడ పెరుగు - పావు కప్పు

నీళ్ళు - తగినన్ని

కూర కోసం:

నూనె - అర కప్పు

జీడిపప్పు - ముప్పావు కప్పు

మష్రూమ్స్ - 150 gms

ఉల్లిపాయ - ఒకటి

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

కారం - అర టేబుల్ స్పూన్

గరం మసాలా - అర టేబుల్ స్పూన్

ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్

కారం - రెండు టేబుల్ స్పూన్స్

ఉప్పు - తగినంత

నీళ్ళు - 350 ml

నెయ్యి -ఒక టేబుల్ స్పూన్

కొత్తిమీర తరుగు - కొద్దిగా

నిమ్మరసం - అర టేబుల్ స్పూన్

తయారీ విధానం:

* గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.

* నూనెలో జీడిపప్పు వేసి సగం వేపుకుని అందులోనే మష్రూమ్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.

* అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలి. వేగిన ఉల్లిపాయల్లో కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా వేపుకోవాలి. అవి వేగాక రెఢీగా ఉన్న పేస్టు వేసి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి అందులో, 350 ml నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి .

* ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి.

* నూనె తేలాక ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్ప్పు, మష్రూమ్స్ వేసి 5 నిమిషాలు ఉడకనిచ్చి.... తర్వాత నెయ్యి, కొత్తిమీర తరుగు చల్లి మరో నిమిషం ఉడకనివ్వాలి.

* దింపే ముందు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇది రైస్ లోకి, చపాతీ లోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.