LATEST NEWS
  ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ   గండబోయిన సూర్యకుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని  కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయనగరానికి చెందిన ఆమె– మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. బుధవారం  పవన్‌ని కలసి.. తమ ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు వివరించారు.  ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ఎలాగైనా కాపాడాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు.దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.  మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన హామీ ఇచ్చారు. పవన్ చొరవపై కేంద్ర విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది. బాధితులను వీలైనంత త్వరగా గుర్తించి, సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది. 
  కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య తెలిపారు."ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు  
  ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా సిట్ బృందాన్ని ముప్పతిప్పలు పెడుతున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును  సిట్ అధికారులు ఐదుసార్లు విచారించారు. ఐదు సార్లు సుమారు నలభై గంటలపాటు ప్రభాకర్‌రావును విచారించింది సిట్. అయితే విచారణలో సమాధానాలు చెప్పకుండా అధికారుల సహనాన్ని పరీక్షించారు ఎస్‌ఐబీ మాజీ చీఫ్. ఈ క్రమంలో ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. పిటిషన్‌లో ప్రభాకర్ రావు మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సిట్ అధికారులను ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెబుతూ వచ్చారు.  తనకేమీ సంబంధం లేదని, తన పైస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేశానని, వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ చేయమంటూ ఎవరికీ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఇదంతా చేశామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. సిట్ అధికారులకు ఆయన డిఫెన్సివ్ మోడ్‌లోనే సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను కస్టోడియల్ విచారణకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రభాకర్ రావుకు ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
    మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. లోకేశ్ ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుందన్నారు.   మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్య పాఠశాల చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతకొంత సాయం చేయాలి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలిని పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశ్యంతోనే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి తెలిపారు. వేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. మెగా పేరెంట్స్​మీటింగ్​తో గిన్నిస్​రికార్డు నెలకొల్పామన్నారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు.  నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం ఇక్కడ వచ్చిందన్నారు. పేరెంట్స్​ కమిటీ ఏర్పాటు చేయాలని 1998‌లో అనుకున్నానని తెలిపారు.  విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్​కు అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఒక టీచర్​ను కూడా నియమించలేదన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగన్​ చెప్పాలన్నారు. ఆంగ్ల మాధ్యమం పెట్టామంటూ లేనిపోని సమస్యలు తీసుకొచ్చారని ఆరోపించారు. టీచర్లను తాము గౌరవంగా చూస్తాం.. నూతన సంస్కరణలను తీసుకు వస్తామని అన్నారు. ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ ​ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.   
  ఇదీ జ‌గ‌న్ బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌కు ప‌త్రిక‌ల్లో పెడుతోన్న క్యాప్ష‌న్స్. జులై 9న జ‌గ‌న్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల ప‌ర‌మార్శ‌కు వ‌చ్చారా? లేక త‌న హంగూ ఆర్భాటం చూపించ‌డానికి వ‌చ్చారా? ఎవ‌రికీ అర్ధం కాలేదు. అద‌స‌లు ప‌ర‌మార్శ యాత్ర‌లా లేదు. దండ‌యాత్ర‌ను త‌ల‌పిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. అధ్య‌క్షుడినే ఏకంగా చొక్కా ప‌ట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవ‌రూ ఎవ‌రి మాట విన‌డం లేదు. జ‌గ‌న్ అరుస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదెవ‌రూ. 10 ల‌క్ష‌ల జ‌నాభా వ‌చ్చినా టీడీపీ స‌భ‌లు స‌జావుగా  జ‌రిగిన‌వి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేక‌లేంటి? ర‌చ్చ రావ‌ణ్య‌మేంటి? కొంద‌ర‌న‌నే మాట‌లేంటంటే అర‌లుంగీలు క‌ట్టి వ‌దిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది స‌ర్వ‌త్ర‌ .అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒక‌టే బ్యాచ్, ఒక‌టే లుక్. ఎలాంటి తేడా లేదు. అల‌జ‌డి  సృష్టించ‌డానికి అంద‌రూ క‌ల‌సి క‌ట్టు క‌ట్టుకుని మూకుమ్మ‌డిగా దిగిన‌ట్టుగా క‌నిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల క‌ష్టాలు తెలుసుకోవ‌డం కాదు.. మ‌న్నాంగ‌డ్డి కాదు. ఇది అదే. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌కు విఘాతం క‌లిగించేదే.. కాబ‌ట్టి దీన్ని కంప‌ల్స‌రిగా క‌ట్ట‌డి చేయాలంటారు కొంద‌రు. మ‌రి కొంద‌రైతే ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా స‌మ్య‌ల‌ను తెలుసుకుని.. ప్ర‌జా వేదిక‌లైన అసెంబ్లీకి వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం  క‌నుగొన‌డం ఒక రూట్ మ్యాప్. ఆయ‌న‌స‌లు అసెంబ్లీకే వెళ్ల‌కుండా  ఏం సాధించేట‌ట్టు? అదీ నిజ‌మే క‌దా అంటారు ఇంకొంద‌రు. జ‌గ‌న్ ఇప్ప‌ట్లో అప్ప‌ట్లో అసెంబ్లీకి వ‌చ్చేది లేదు. అక్క‌డ రైతులు కాదు.. ఇత‌రులెవ‌రి స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించే అవ‌కాశమే లేదు. ఇదంతా త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.  అయినా సీజ‌న్ అయిపోయాక వ‌చ్చి ప్ర‌యోజ‌న‌మేంటి? అంటారు కొంద‌రు రైతులు. ఒక వేళ జ‌గ‌న్ నిజంగా చేయాల్సి వ‌స్తే ఇప్ప‌టికే జిల్లాలోని ఫ్యాక్ట‌రీల్లో నిల్వ ఉన్న ల‌క్ష కిలోల ప‌ల్ప్ ని కొనాలి. ఎందుకంటే త‌మ ద‌గ్గ‌ర అంత నిల్వ ఉంది కాబ‌ట్టి.. ఈ సీజ‌న్ కి ప‌ల్ప్ వ‌ద్ద‌న్న‌ది ఫ్యాక్ట‌రీల మాట‌. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడ‌వుతుందో ఆపై తాము కొంటామ‌ని అంటారు వారు. ఈ సీజ‌న్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్ప‌ట్లో ముప్పై రూపాయ‌లు ప‌ర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయ‌ల‌కు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొన‌డం లేదు. ఇక్క‌డ చూస్తే ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు కొంటున్నాయి క‌దాని.. టేబుల్ ర‌కాలు ప‌క్క‌న పెట్టి, తోతాపురి ర‌కం ఎక్కువ‌గా వేసేశారు రైతులు.  ఈ క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల వ‌చ్చిన తంటా ఇది. దానికి తోడు త‌న హ‌యాంలో ఈ రైతుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. జ‌గ‌న్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖ‌లాలు కూడా లేవు. ఈ  సారి వ‌ర్షాలు కూడా బాగా ప‌డ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. ఇది జ‌నానికి అర్ధం కావ‌ల్సిన విష‌యం. కానీ  జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికో వేదిక చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో స‌మ‌స్య ఏంటో అర్ధంకాక ఒక గ‌జిబిజి గంద‌ర‌గోళానికి ఆస్కార‌మేర్ప‌డుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!  
ALSO ON TELUGUONE N E W S
నాచురల్ స్టార్ నాని(Nani),దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్'(The paradise). ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి 'దసరా'(Dasara)తో హిట్ ని అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు సైతం సాధించారు. దీంతో 'ది ప్యారడైజ్'పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ తో తెలుగు తెరపై ఇంతవరకు రాని ఒక సరికొత్త  కాన్సెప్ట్ తో 'ది ప్యారడైజ్'  తెరకెక్కబోతుందనే విషయం అర్ధమవుతుంది.  ఇక ఈ మూవీలో 2023 వ సంవత్సరంలో హిందీ చిత్ర సీమలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘కిల్(Kill)'మూవీ ఫేమ్ 'రాఘవ్ జుయల్'(Raghav Juyal)కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా ప్రకటిస్తు ఒక వీడియో రిలీజ్ చేశారు. సదరు వీడియోలో రివాల్వర్, కత్తులు, స్టయిలిస్ట్ కళ్ళ జోడుని చూపించడంతో పాటు జుయల్ కి   శ్రీకాంత్ తన క్యారక్టర్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. దీంతో సదరు వీడియోలో ఉన్న దాన్ని బట్టి 'ప్యారడైజ్' లో జుయల్' క్యారక్టర్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్ధమవుతుంది. ఈ రోజు జుయల్ పుట్టిన రోజు కావడం విశేషం. నిజానికి 'ప్యారడైజ్'లో జుయల్ చేయబోతున్నాడనే రూమర్స్  చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులందరూ ఆ వార్త నిజం కావాలని అనుకున్నారు. ఎందుకంటే కిల్ మూవీతో పాటు తన గత చిత్రాల్లో జుయల్ నటన ఎంతో  అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే  పాన్ ఇండియా వ్యాప్తంగా  జుయల్ ఓవర్ నైట్ స్టార్ అవ్వడంతో పాటు ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. దీంతో ప్యారడైజ్ కి పాన్ ఇండియా స్థాయిలో అదనపు క్రేజ్ ఏర్పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనిరుద్ సంగీత  సారధ్యంలో తెరకెక్కుతున్న 'ప్యారడైజ్' ని 'దసరా' మూవీని నిర్మించిన సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న  ప్యారడైజ్ మార్చి 26 , 2026 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.       
  అప్పట్లో తెలుగునాట టాప్ యాంకర్స్ లో ఉదయభాను ఒకరు. ఎన్నో షోలను తనదైన యాంకరింగ్ తో హిట్ చేశారు. ఉదయభాను హోస్ట్ చేస్తే చాలు.. ఆ షో హిట్ అనే అంతలా పేరు పడిపోయింది. ఉదయభాను ఎనర్జిటిక్ యాంకరింగ్ కి అప్పట్లో ఎందరో ఫ్యాన్స్ ఉండేవారు. అంతటి స్టార్డం చూసిన ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయా? కొందరు సిండికేట్ గా మారి ఆమె అవకాశాలకు గండి కొడుతున్నారా? తాజాగా ఉదయభాను చేసిన సంచలన వ్యాఖ్యలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది.   సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ ఈవెంట్ కి హోస్ట్ గా ఉదయభాను రావడం విశేషం. ఇదే విషయాన్ని ఆ వేడుకకు గెస్ట్ గా హాజరైన దర్శకుడు విజయ్ కనకమేడల ప్రస్తావించాడు. "చాలా రోజుల తర్వాత ఉదయభాను గారు మళ్ళీ ఈవెంట్ లు చేస్తున్నారు.. చాలా సంతోషంగా ఉంది." అని విజయ్ అన్నాడు. దీనికి ఉదయభాను ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. "ఇదొక్కటే చేస్తున్నాను. మళ్ళీ చేస్తానని గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్ అనుకుంటాం.. చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో ఈ ఈవెంట్ చేయగలిగా." అని ఉదయభాను అన్నారు.   ఉదయభాను మాటలను బట్టి చూస్తే.. ఇక్కడ కొందరు సిండికేట్ గా ఏర్పడి, తనలాంటి వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనిపిస్తోంది. నిజానికి అప్పట్లో సుమ, ఝాన్సీ, ఉదయభాను టాప్ యాంకర్స్ గా ఉండేవారు. వీరిలో యూత్ లో ఎక్కువగా ఉదయభానుకి ఫాలోయింగ్ ఉండేది.    సుమ ఇప్పటికీ యాంకరింగ్ లో రాణిస్తోంది. ఝాన్సీ నటిగా మారి సినిమాలు చేస్తోంది. అయితే ఉదయభాను మాత్రం అటు యాంకర్ గానూ, ఇటు యాక్టర్ గానూ బిజీగా లేరు. ఒకట్రెండు సినిమాల్లో నటించారు. 'లీడర్', 'జులాయి' వంటి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిశారు. కానీ, పూర్తిస్థాయిలో నటిగా బిజీ అవ్వలేదు. అలా అని యాంకర్ గా.. షోలు కానీ, ఈవెంట్ లు కానీ పెద్దగా చెయ్యట్లేదు. ఉదయభాను తనకి ఆసక్తి లేక యాంకరింగ్ తగ్గించారేమో అనే అభిప్రాయం ఇప్పటిదాకా ఉండేది. కానీ, కొందరు ఉదయభానుకు ఈవెంట్ లు లేకుండా చేస్తున్నారని ఆమె తాజా కామెంట్స్ తెలుపుతున్నాయి.   ప్రస్తుతం సినిమా ఈవెంట్లు అంటే మొదట వినిపించే పేరు సుమ. పెద్ద సినిమాల ఈవెంట్లు ఎక్కువగా సుమనే చేస్తూ ఉంటారు. ఇక చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు మంజూష, గీతా భగత్, స్రవంతి వంటి వారు ఎక్కువగా హోస్ట్ చేస్తున్నారు. మరి ఈ యాంకర్ల ఎంపిక ఎలా జరుగుతుంది. ఈవెంట్ మేనేజర్ల చేతిలో ఉందా? పీఆర్ఓ చేతుల్లో ఉందా? లేక మూవీ టీం ఇన్వాల్వ్ అవుతుందా? అసలు ఉదయభానుకి అవకాశాలు రాకుండా చేస్తున్నది ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఉదయభాను అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. టాలెంటెడ్ యాంకర్ కి అవకాశాలు లేకుండా చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.  
Raghav Juyal has made the entire nation notice him with awe and shock in his film, Kill. A funny guy who made people laugh with his antics as an anchor, a dancing sensation - who made Slow Motion walk iconic and made entire nation look at lyrical, freestyle dance forms, played a ruthless robber like never before.  His transformation from a dancer with funny attitude to a seriously talented actor has shocked everyone. Now, he is debuting in Telugu with Natural Star Nani's The Paradise. Srikanth Odela is directing the film and with the teaser, the team showcased that it will be mad, violent action flick.  Now, Raghav Juyal has been cast in a furious antagonist role. The makers state that the role will be more terrifying than Kill and his appearance in lesser known Yudhra. As a ruthless, merciless and power-hungry antagonist his character will be seen as a person who cannot tolerate even a small raise in voice.  He loves to suppress and oppress downtrodden and the rebellion is lead by Nani in Secunderabad set in 1960's. Srikanth Odela is taking care of every minute detail about his character and he is working round the clock to present him in such a terrifying manner that Nani vs him episodes would be a blast on screen, say makers.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Pragya Jaiswal did not find huge success as much as other contemporaries but she has been one of the most followed actresses on social media. Recently, her bold pictures and glamour show has been keeping her highly relevant. Now, she sizzled in a white monokini and internet is going crazy looking at them.    The actress has been sharing bikini, monokini, vacation pics from different places along with professional photoshoots. After Daaku Maharaaj, she will be once again seen in Akhanda 2 Thandaavam, reprising her role from Akhanda. But she might not be the full fledged leading lady in the film, from reports.    Except besides Nandamuri Balakrishna, she is not being offered roles from Telugu Cinema, even though she is beautiful and ready to play any role. Keeping all that aside, glam lovers are happy looking at bold updates from time to time.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)సుజిత్(sujeeth)కాంబినేషన్ లో తెరకెక్కిన 'సాహో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ నటి 'శ్రద్దాకపూర్'(Shraddha Kapoor). ఒకప్పటి అగ్ర నటుడు 'శక్తీ కపూర్' కూతురిగా 2010 లో హిందీ సినీ  సినీ రంగ ప్రవేశం చేసిన శ్రద్దా, ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలని పోషించి స్టార్ డమ్ ని సంపాదించింది.  ప్రముఖ రచయిత రాహుల్ మోడీ(Rahul Mody)తో శ్రద్దాకపూర్  డేటింగ్ లో ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ ఇద్దరు కలిసి ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్ తో ఉన్న ఆ   ఇద్దరు, పక్క పక్క సీట్స్ లో కూర్చోగా, రాహుల్ కి శ్రద్ధ ఫోన్ లో ఏదో చూపిస్తూ ఉంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు ఆ ఇద్దరి  ఫోటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒక వీడియోని కూడా రికార్డు చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధ, రాహుల్ కి తెలియకుండా ఎయిర్ లైన్స్ సిబ్బంది ఫోటోలు తీయడంపై, పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా  మండిపడుతున్నారు. రాహుల్, శ్రద్ధ కలిసి చాలాసార్లు మీడియాకి పోజులిచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ గత ఏడాది చివరలో విడుదలైన 'స్త్రీ 2 'లో ప్రధాన క్యారక్టర్ ని పోషించి మంచి విజయాన్ని అందుకుంది. ప్యార్ కా పంచనామా, సోను కె  టైటుకి  స్వీటీ, దే దే  ప్యార్  దే, తు ఝూతి మెయిన్ మక్కర్ వంటి చిత్రాలకి రచయితగా పని చెయ్యడంతో పాటు దర్శకత్వ శాఖలోను పని చేసాడు.        
భారతీయ సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు 'విద్యాబాలన్'(Vidya Balan). రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన తన సినీ జర్నీలో ఎన్నో హిట్ సినిమాలు ఉండటంతో పాటు ఆయా చిత్రాల్లోని పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్' లో ఆమె పోషించిన టైటిల్ రోల్ నే అందుకు ఉదాహరణ. గత ఏడాది  హర్రర్ కామెడీ 'భూల్ భూలయ్య 3 ' లో మంజులిక, మల్లికా అనే రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అలరించింది. విద్యాబాలన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ మొదట్లో 'మోహన్ లాల్'(Mohanlal)సరసన చక్రం అనే మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను. కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకోవడంతో మూవీ   ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత అనుకోకుండా ఆగిపోయింది. మోహన్ లాల్ కి, చిత్ర నిర్మాతకి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతోనే ఆగిపోయింది. కానీ నా వల్లే ఆగిపోయిందనే ప్రచారం చేసి ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. ఫలితంగా చక్రంతో పాటు ఒప్పకున్న తొమ్మిది దక్షిణాది చిత్రాల నుంచి నన్ను తొలగించేసారు. ఆ ప్రభావం నా కెరీర్ పై పడింది. కానీ అమితాబచ్చన్ లాంటి వాళ్ళు ప్రారంభంలో తిరస్కరణకి గురయ్యారని తెలిసి ముందుకు సాగాను. విశ్వాసంతో ముందుకు సాగితే ఖచ్చితంగా మన రోజు అంటు వస్తుందని చెప్పుకొచ్చింది.      విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరామారావు'(Ntr)జీవిత కథ ఆధారంగా అయన తనయుడు గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నటించి, రూపొందించిన చిత్రాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ రెండు   చిత్రాల్లో  ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకమ్మ' క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి  తెలుగు ప్రేక్షకుల్ని కూడా విద్యా బాలన్ తన నటనతో మెప్పించింది.  
  దేవుడి మీద నమ్మకం ఉండటంలో తప్పులేదు. ఏదైనా పని మొదలు పెట్టేముందు.. ఇష్ట దైవాన్ని పూజిస్తే శుభం జరుగుతుందని ఎందరో నమ్ముతారు. దానికి వల్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ తో పనిని మొదలుపెడతాం. దాంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. కొందరు మాత్రం తమ టాలెంట్ కంటే కూడా.. స్వామిజీలనే ఎక్కువగా నమ్ముతుంటారు. ఏవోవో పూజలు చేసేసి.. ఆ పూజల వల్ల తమ కెరీర్ దూసుకుపోతుంది అనుకుంటారు.   వివాదాస్పద జ్యోతిస్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జ్యోతిష్యం పేరుతో సినీ ప్రముఖల వ్యక్తిగత జీవితాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ కొందరు సినీ జనాలు వేణుస్వామిని నమ్ముతుంటారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు వేణుస్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకోవడం చూస్తున్నాం. గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సైతం వేణుస్వామి చేత పూజలు చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ లిస్టులో డింపుల్ హయాతి, అషు రెడ్డి వంటి భామల పేర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ఆ లిస్టులో చేరింది.   'సవ్యసాచి'తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్.. తక్కువ సినిమాలతోనే యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో బడా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24 ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 'ది రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత మరికొన్ని భారీ ఆఫర్లు నిధిని వరించే అవకాశముంది. ఇప్పటికే, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ లాక్ అయినట్లు సమాచారం. ఇలా వరుస క్రేజీ సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్న నిధి.. తాజాగా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.   నిధి అగర్వాల్ కోసం పూజ జరిపించి, ఆమెను ఆశీర్వదించినట్లు తెలుపుతూ.. తాజాగా వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా వీడియోలు పంచుకున్నాడు. వేణుస్వామితో పూజలు చేయించుకున్న తర్వాత పలువురు హీరోయిన్ల కెరీర్ పీక్స్ వెళ్ళిందనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఆ నమ్మకంతోనే నిధి కూడా గతంలో ఓసారి పూజలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ పూజల తర్వాత ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చాయట. అందుకే ఇప్పుడు మరోసారి పూజలు చేయించుకున్నట్లు సమాచారం. ఈ పూజ తర్వాత తన కెరీర్ మరింత ఊపందుకుంటుందని నిధి భావిస్తున్నట్టు వినికిడి. మరి ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.   అయితే వేణుస్వామితో నిధి అగర్వాల్ పూజలు చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నిధిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నీ టాలెంట్ వల్ల ఆఫర్స్ వస్తాయి కానీ.. ఆయన పూజల వల్ల ఎందుకొస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.  
Enforcement Directorate has decided to register a case on Vijay Deverakonda, Rana Daggubati, Manchu Lakshmi, Prakash Raj, Sudigali Sudheer and many other celebrities, social media influencers for promoting illegal betting applications. The case also involves violations under the Prevention of Money Laundering Act (PMLA). The ED has taken cognizance of promotional activities carried out by a wide range of individuals who endorsed betting platforms, thereby encouraging users to participate in unlawful online betting. Here's The list of those named in the ED's case:  1. Rana Daggubati 2. Prakash Raj 3. Vijay Deverakonda 4. Manchu Lakshmi 5. Pranitha Subhash 6. Nidhhi Agerwal 7. Ananya Nagalla 8. Siri Hanumanth 9. Sreemukhi 10. Varshini Sounderajan 11. Vasanthi Krishnan 12. Shobha Shetty 13. Amrutha Chowdhary 14. Nayani Pavani 15. Neha Pathan 16. Pandu 17. Padmavati 18. Imran Khan 19. Vishnu Priya 20. Harsha Sai 21. Bhaiyya Sunny Yadav 22. Shyamala 23. Tasty Teja 24. Reethu Chowdhary 25. Bandaru Seshayani Supreetha The ED has also named key individuals involved in the operation and management of these betting apps : 26. Operators of the betting platforms 27. Kiran Goud 28. Social media influencers Ajay, Sunny, and Sudheer 29. YouTube channel ‘Local Boy Nani’ As few social activists raised objection against celebrities promoting illegal betting apps. ED started investigation into the actors promoting them and many celebrities have also apologised for promoting them. Still, ED has moved forward with registering the case. We have to wait and see, how celebrities will respond.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకగా మారిన నటి'మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur). ఆ తర్వాత నాచురల్ స్టార్ 'నాని'(Nani)తో కలిసి 'హాయ్ నాన్న'లో జత కట్టి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్జ్ ఒకటి  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో 'మృణాల్ ఠాకూర్' తన కాళ్లకి మెట్టెలు తొడిగి ఉన్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్స్ షాక్ కి గురయ్యి, మృణాల్ రహస్యంగా ఎవరినైనా పెళ్లి  చేసుకుందేమో అంటు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే 'డెకాయిట్' చిత్ర యూనిట్ ఆ పిక్ ని షేర్ చేసింది. అడవి శేషు(Adavi Sesh)హీరోగా 'డెకాయిట్'(Dacoit)అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో 'మృణాల్' హీరోయిన్ గా చేస్తుంది. డెకాయిట్ షూటింగ్ లో  పాల్గొనడం కోసం మృణాల్ హైదరాబాద్ వచ్చిందని చెప్పడానికే, కాళ్ళకి మట్టెలు ఉన్న పిక్ ని షేర్ చేసారు. దీంతో డెకాయిట్ లో తన క్యారక్టర్ కి సంబంధించి మృణాల్ కాళ్ళకి మట్టెలు ధరించినట్టుగా తెలుస్తుంది. షానియెల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెకాయిట్ ని యార్లగడ్డ సుప్రియతో కలిసి సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర దర్శకుడు, అగ్ర నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap)ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి బాసర్ల కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.      
  20 ఏళ్ళ వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికే ఆలోచిస్తుంటారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 20 ఏళ్లకే ఎన్నో సంచనాలు సృష్టించి స్టార్ హీరోగా ఎదిగాడు. 19 ఏళ్లకే 'ఆది' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. 20 ఏళ్లకే 'సింహాద్రి'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండో సినిమా కావడం విశేషం.   తారక్ హీరోగా నటించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రాజమౌళి. అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు రెండో అవకాశం రాలేదు. అనుకోకుండా 'సింహాద్రి' రూపంలో రెండో సినిమాని కూడా ఎన్టీఆర్ తోనే చేసే ఛాన్స్ దక్కించుకున్న రాజమౌళి..  తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించాడు.      జులై 9, 2003 న విడుదలైన 'సింహాద్రి' చిత్రం.. అప్పటిదాకా టాలీవుడ్ లో ఉన్న రికార్డులను తిరగరాసింది. ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సన్నివేశాలు, మాస్ డ్యాన్స్ స్టెప్పులు.. ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా చేశాయి. ఈ చిత్రం 55 సెంటర్స్ లో 175 రోజులు ఆడి, ఎప్పటికీ చెక్కుచెదరని రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు, ఆ తర్వాత పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. వాటిలో చాలా సినిమాలు సింహాద్రి కలెక్షన్స్ దాటాయి కానీ, 175 రోజుల రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. సినిమా విడుదలై 22 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. ప్రస్తుతం ఎంతటి హిట్ సినిమాలైనా 50 రోజులు నడిచే పరిస్థితి కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే ఏ సినిమాకి దక్కని విధంగా అత్యధిక కేంద్రాలలో 175 రోజుల ఆడిన చిత్రంగా సింహాద్రి పేరు శాశ్వతంగా నిలిచిపోనుంది.   సింహాద్రి విజయానికి ఎన్నో కారణాలు కారణాలున్నాయి. కీరవాణి సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఆయన కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 'చీమ చీమ', 'ఆంధ్ర సోడా బుడ్డి' సాంగ్స్ అయితే మాస్ ని ఉర్రుతలూగించాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా మాస్ ని మెప్పించాయి. రాజమౌళి సినిమాలలో హీరోలు పట్టుకునే ఆయుధాలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలలో సింహాద్రి గొడ్డలిని మించిన ఆయుధం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ గొడ్డలి పట్టుకొని ఎన్టీఆర్ శత్రువులపై విరుచుకుపడుతుంటే మాస్ ఊగిపోయారు. 20 ఏళ్ళ కుర్రాడు యంగ్ టైగర్ లా వెండితెరపై రౌద్ర రసం పండిస్తే అందరూ ఫిదా అయ్యారు. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ ఇలా ఒకటేమిటి? అన్ని కరెక్ట్ గా కుదిరాయి కాబట్టే 'సింహాద్రి' అంతటి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి అంతకుమించిన విజయాలను అందుకున్నారు. అలాగే వీళ్ళ కాంబినేషన్ లోనే 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా వీళ్లిద్దరి కెరీర్ లో 'సింహాద్రి'కి ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది.   ముఖ్యంగా ఎన్టీఆర్ కి, ఆయన ఫ్యాన్స్ కి 'సింహాద్రి' అనేది వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఎందుకంటే ఏకంగా బాలకృష్ణ,చిరంజీవిల స్టార్డంని సవాల్ చేసేలా అప్పట్లో సింహాద్రి చరిత్ర సృష్టించింది. అప్పటికే బాలకృష్ణ,చిరంజీవి తెలుగునాట తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా వారి సినిమాలు వంద రోజులు ఆడేవి. అంతటి స్టార్డం ఉన్న హీరోల రికార్డులను కేవలం 20 ఏళ్ళ వయసున్న ఎన్టీఆర్ కొట్టాడు. ఈ జనరేషన్ లో వాళ్ళ రికార్డులను కొట్టిన మొదటి హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. ఆరోజుల్లో సింహాద్రితో ఎన్టీఆర్ సృష్టించిన సంచలనానికి ఉదాహరణగా చెప్పుకుంటే.. బాలయ్య నరసింహనాయుడు చిత్రం 105 సెంటర్స్ లో వంద రోజులు ఆడగా.. చిరు ఇంద్ర మూవీ 122 సెంటర్స్ లో ఆడింది. అలాంటిది సింహాద్రి సినిమా ఏకంగా 150 సెంటర్లలో వంద రోజులు ఆడి చరిత్ర సృష్టించింది.  
పిల్లలను పెంచడం పిల్లల ఆట కాదు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దానికి తగినట్టే అన్నీ వారికి అందించాలని అనుకుంటారు. కానీ చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని పరిస్థితులలో పిల్లలను తిట్టడం వారి మెదడు,  మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను  ఎప్పుడు తిట్టకూడదో,  దీని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. పిల్లలు భయంలో ఉన్నప్పుడు.. తప్పు చేసిన తర్వాత పిల్లలు కొన్నిసార్లు భయపడతారు. ఇలా  భయపడితే లేదా ఇప్పటికే ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉంటే, ఈ సమయంలో పిల్లలను తిట్టడం సరైనది కాదు. అలాంటి పరిస్థితిలో, పిల్లల మనస్సు మరింత భయపడవచ్చు. దీని ఫలితంగా పిల్లలు తను చేసిన పనులను,  విషయాలను తల్లిదండ్రులతో  పంచుకోవడం మానేస్తాడు. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఇప్పటికే సున్నితంగా ఉంటే అతన్ని తిట్టడానికి బదులుగా ప్రేమతో జరిగిన తప్పు గురించి   వివరించడం మంచిది. కొత్తగా ఏదైనా చేసేటప్పుడు చేసే తప్పులు.. పిల్లలు ఏదైనా విషయం గురించి  ఆసక్తిగా ఉండి, ప్రతి క్షణం కొత్తగా ఏదైనా చేయాలని లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అలాంటి పరిస్థితిలో, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. పిల్లలు నేర్చుకునేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఈ తప్పులు వారు మంచిగా మారడానికి,  వారికి గొప్ప అనుభవాలుగా సహాయపడతాయి. అందువల్ల, ప్రతి చిన్న తప్పుకు వారిని తిట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని కారణంగా పిల్లలు కొత్తగా ఏదైనా చేసే ముందు భయపడతారు.   పిల్లలు అలసిపోయినప్పుడు.. పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, వారు ఏదైనా తినేటప్పుడు  పిల్లలను  తిట్టకూడదు. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా  అలసిపోయినా లేదా ఆకలిగా ఉన్నా వారి మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి సమయంలో పిల్లలను తిడితే  ఇది పిల్లలకు మరింత  చిరాకు తెప్పిస్తుంది. ఆ సమయంలో పిల్లలను  తిట్టడం ప్రారంభిస్తే, విషయం మరింత దిగజారిపోతుంది.అందుకే పిల్లలను మందలించాలన్నా మొదట వారి పరిస్థితి  సాధారణ స్థితికి వచ్చాక ఆ తరువాత  తప్పు గురించి వివరించి చెప్పాలి.                                         *రూపశ్రీ.
ఒక రిలేషన్ ఏర్పడటం సులువే  కానీ దానిని కొనసాగించడం మాత్రం   కష్టం. విజయవంతమైన సంబంధంలో ప్రేమ, గౌరవం, నమ్మకం, నిజాయితీ ఉండాలి. మరోవైపు, సందేహం, అవమానం, మోసం, అబద్ధాలు, హింస ఇవన్నీ సంబంధాన్ని చెడగొట్టడానికి కారణం అవుతాయి. కానీ కొంతమందికి అనుమానించే అలవాటు ఉంటుంది. వారు తమ భాగస్వామిని ప్రతి విషయంలోనూ అనుమానిస్తారు. ఇది సంబంధంలో బాధను మిగులుస్తుంది.   అందువల్ల, సంబంధంలో నమ్మకం,  ఒకరి పట్ల ఒకరు గౌరవం  కలిగి ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తల సంబంధంలో నమ్మకాన్ని,  గౌరవాన్ని  పెంపొందించడంలో మీకు సహాయపడే చిట్కాలు తెలుసుకుంటే.. స్పష్టమైన సంభాషణ.. సంబంధం ప్రారంభంలో, జంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కానీ క్రమంగా సంభాషణ తగ్గడం ప్రారంభమవుతుంది. వారు తమ భావాలను వివరించలేరు,  ఇతరుల భావాలను అర్థం చేసుకోలేరు. అటువంటి పరిస్థితిలో ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తడం ప్రారంభమవుతుంది. ఇది అనుమానానికి దారితీస్తుంది. ఇలాంటి  పరిస్థితిలో, ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఒకరి మాటలు,  భావాలను అర్థం చేసుకోవడం,  ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడటం చాలా ముఖ్యం. నమ్మకం.. నమ్మకం అనేది సంబంధానికి పునాది. భార్యాభర్తల  ఇద్దరి మధ్య నమ్మకం లేకపోతే, ఆ సంబంధం బలహీనపడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఒకరినొకరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. మనసులో ఏవైనా సందేహాలు ఉంటే మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవాలి.  తద్వారా నమ్మకం పెరుగుతుంది. నాణ్యమైన సమయం.. కొన్నిసార్లు బిజీ జీవనశైలి కారణంగా ఇప్పటి భార్యాభర్తలు  ఒకరికొకరు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇది సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. ఇది సంబంధంలో అనుమానాన్ని,  అపనమ్మకాన్ని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో సంబంధానికి సమయం ఇవ్వడం ముఖ్యం.  భాగస్వామితో సమయం గడపాలి.  ఇద్దరూ కలిసి భోజనం  చేయడం, వంట చేయడం,  వారాంతాల్లో బయటకు వెళ్లడం, లేదా ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంబంధం బలపడుతుంది.  *రూపశ్రీ.
  వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని,  విశ్రాంతిని కలిగిస్తుంది. అందుకే చాలామందికి వర్షాకాలం అంటే బాగా ఇష్టం ఉంటుంది.  కానీ దీని కారణంగా చాలా సమస్యలు కూడా ఉన్నాయి.  వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగా తోడు కాకపోవడం. చలికాలంలో జరిగేది ఏంటంటే.. పెరుగు తొందరగా తోడు కాకపోవడం ఒకటైతే.. పెరుగు బాగా క్రీమ్ లాగా కాకపోవడం మరొకటి.    కాలాన్ని బట్టి అన్ని మారుతున్నట్టే ఈ ప్రక్రియలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది.  అయితే ఈ చలికాలంలో పెరుగు బాగా తోడు కావాలన్నా, క్రీమ్ గా గడ్డ పెరుగు రావాలన్నా ఈ కింది చిట్కాలు గమనించి వాటిని ఫాలో అవ్వాలి. ఉష్ణోగ్రత.. పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా ముఖ్యం.  కొంతమంది పాలను వేడి చేసి అలా వదిలేసి ఉష్టోగ్రత చెక్ చేయకుండా తోడు పెడుతుంటారు. వాతావరణం కారణంగా పాలు తొందరగా చల్లగా అవుతాయి. అందుకే పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పాత్ర.. పెరుగు తోడు పెట్టాలి అనుకునే పాత్ర శుభ్రంగా ఉండాలి.  కొందరు ఏం చేస్తారంటే.. పాలు కాచిన గిన్నెలో అట్లాగే కాసింత పెరుగు వేసేస్తుంటారు. ఇది పెరుగు అదొక రకమైన వాసన,  పెరుగు రుచి మారడానికి కారణం అవుతుంది.  శుభ్రంగా, పొడిగా ఉన్న గిన్నెలో పాలు వేసి అందులో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది. పెరుగు కంటెంటే.. పాలు తోడు పెట్టడానికి పెరుగును జోడించడం మామూలే. అయితే  చలికాలంలో వాతావరణం కారణంగా కేవలం కొద్దిగా పెరుగు వేస్తే అది తోడు కావడం చాలా ఆలస్యం అవుతుంది.  పుల్లగా లేకుండా ఫ్రెష్ గా ఉన్న పెరుగును వినియోగించాలి.  ఒక లీటరు పాలకు ఒకటి నుండి రెండు స్పూన్ల తాజా పెరుగుతో తోడు పెడితే పెరుగు చాలా బాగా తోడవుతుంది. ఒక చిట్కా.. పెరుగును పాలలో ఒక చెంచా మొత్తంలో వేసి అలా మూత పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేస్తే పెరుగు తోడు కావడం లేటవుతుంది. అలా కాకుండా పెరుగును పాలలో వేయగానే పాలు మొత్తం బాగా కలపాలి.  ఇలా చేస్తే పెరుగు చక్కగా సమంగా తయారవుతుంది. ప్రదేశం.. పెరుగు బాగా తోడు కావాలి అంటే ఇంట్లో స్థిరమైన, కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో పాల గిన్నెను ఉంచాలి. దీని వల్ల పెరుగు బాగా తోడవుతుంది. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తొందరగా తోడు కాదు.                                     *రూపశ్రీ.  
  మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం,  నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం,   నొప్పి ఎక్కువగా ఉండటం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన  పేస్ట్ ఉంది.    దానిని మోకాలి నొప్పి ఉన్న  ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి.  ఉదయం నిద్రలేచిన తర్వాత  చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి,  ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం  కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1  నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా  లేదా చాలా పలుచగా ఉండకూడదు.  మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా  పూయాలి.  దానిపై మెత్తని  కాటన్ వస్త్రాన్ని చుట్టాలి.  8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది.  ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని  తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  మధుమేహాన్ని నిర్వహించడానికి  చాలా పద్ధతులను ప్రయత్నిస్తారు. తీపి ఆహారం తగ్గించడం,  చక్కెరకు దూరంగా ఉండటం,  అధిక మద్యపానాన్ని నివారించడం,   ఒత్తిడిని నిర్వహించడం.. ఇలా చాలా విషయాలు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.  కానీ గుడికి వెళ్లడం ద్వారా షుగర్ నయమవుతుందని మీరు విన్నారా?  గుడికి వెళ్లడం  వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని,  కొన్ని సందర్భాల్లో మధుమేహం పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఇది  నిజమే అని పోషకాహార నిపుణులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇదెలా అనే విషయం తెలుసుకుంటే.. గుడికి వెళ్లడం అంటే ఇంటి నుండి గుడి ఎంతో కొంత దూరంలో ఉంటుంది.  ఇది ఒక చక్కని వాకింగ్ సెషన్ లాంటిది. అంతేకాదు.. గుడికి వెళ్తే అక్కడ మళ్లీ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇంకొక ముఖ్య విషయం ప్రశాంతత.  గుడిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ కొట్టే గంట చుట్టు ప్రక్కల వాతావరణాన్ని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది.  గుడి చుట్టూ ఉండే మొక్కలు, ఇతర  విషయాలు కూడా చాలా పాజిటివ్ గా ఉంచుతాయి. ఇది సహజంగానే మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగానే రోజుకు ఒక 10వేల అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రించవచ్చు. అంతేకాదు.. ప్రీడయాబెటిస్ ను కూడా నయం చేయవచ్చు. ఇలా గుడికి వెళ్తూ కార్బోహేడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మధుమేహం నియంత్రణ.. కొన్నేళ్లు ఇలా చేస్తే మధుమేహాన్ని నయం చేయడం సాధ్యమే.. అంటున్నారు.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  బిపి ని సాధారణంగా  రక్తపోటు అని కూడా పిలుస్తారు.  హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు  గుండెపోటు,  స్ట్రోక్‌లకు కారణమవుతుంది.   వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు,  దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు.  అందుకే దీనిని  సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి.  వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం  గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్,  మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు,  క్రమం తప్పకుండా వ్యాయామం,  వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో  అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం.  ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే  ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు,  మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల  కలయిక ఉండాలి. ఇది  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో  అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది.   క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది.  బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది.  ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..