వరంగల్: నాలుగు ఓట్లు కాంగ్రెస్‌కే

 

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పోలయిన నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే పోలయ్యాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు వున్నాయి. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు వుంటాయి. 22 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలలోపు తుది ఫలితం రానుంది.