బీజేపీ పార్టీ ఆఫీసుకు వాస్తు దోషం.. అదేనా మోడీకి శాపం

 

టెక్నాలజీ ఎంత పెరిగినా మన వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి.. అలాంటి నమ్మకాల్లో ఒకటే వాస్తు.. వాస్తు నమ్మకం రాజకీయ నాయుకులు, సినిమా వాళ్లలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.. చాలా మంది నాయకులు ఇంటిని, పార్టీ ఆఫీసుని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం చూస్తుంటాం.. ఐతే ఇప్పుడు వాస్తు అంశం బీజేపీ పార్టీలో హాట్ టాపిక్ అయినట్టు తెలుస్తుంది.. రీసెంట్ గా ఢిల్లీలో నిర్మించిన బీజేపీ పార్టీ కొత్త ఆఫీసులో వాస్తు దోషం ఉందని కొందరు బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట.. 2014 లో అధికారంలోకి వచ్చాక బీజేపీ దేశంలో తిరుగులేని శక్తిగా వెలిగింది, కానీ కొంత కాలంగా పరిస్థితి తారుమారైంది..

కర్ణాటకలో అధికారం దక్కలేదు, కొన్ని రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలతో చేదు అనుభవం, మిత్ర పక్షాల దూరమవడం, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటం.. ఇవన్నీ చూసి కొత్త ఆఫీసుకి వచ్చాకే పార్టీకి కష్టకాలం మొదలైంది.. దానికి కారణం వాస్తుదోషమే అని భావిస్తున్నారట.. అందుకే మళ్ళీ పాత ఆఫీసుకే వెళ్ళాలి లేదా కొత్త ఆఫీసును వాస్తు ప్రకారం మార్పులు చేయాలి అనుకుంటున్నారట.. మరి మోడీ 'ఆఫీస్ వాస్తు దోషమే, తనకు శాపం' అని భావించి నేతలు చెప్పినట్టు చేస్తారా? లేక నా వాస్తు బాగుంది వచ్చే ఎన్నికల్లో కూడా నాదే విజయం అంటూ దైర్యంగా ముందుకెళ్తారో చూడాలి.