టిబెట్‌లో వరుస భూప్రకంపనలు

హిమాలయ దేశం టిబెట్‌ ఉదయం వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోయింది. డింగ్యే కౌంటిలో 5.3 తీవ్రతతో తొలుత భూమి కంపించింది. అనంతరం కొద్దిసేపటికే టింగ్రీ కౌంటీలో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.