మా మీదే కేసులున్నాయి.. నాయిని

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలకు బలిగొని అమరులైన కుటుంబాలకు ఇప్పుడు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఐదుగురి కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేస్తుందని.. రూ. 10 లక్షల చెక్కులు అందజేశారు. ఉద్యమంలో పాల్గొన్న సమయంలో చాలామందిపై అప్పటి ప్రభుత్వం చాలా కేసులు పెట్టిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు వెయ్యిమందికి పైగా కేసులు రద్దు చేశామని తెలిపారు. అయితే రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా రద్దు కాలేదని.. నా మీదే ఐదు కేసులు ఉన్నాయి.. వాటిలో మూడు కేసులను కోర్టు కొట్టివేయగా మిగిలిన రెండు కేసుల్లో భాగంగా ఇప్పటికీ కోర్టుకు హాజరవుతూనే ఉన్నానని అన్నారు. అంతేకాదు 1969 సంవత్సరంలో మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని తెలిపారు.