కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేత..!
Published on: Tue Sep 1, 2026 2:52PM
.webp)
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై విధించిన స్టేను న్యాయస్థానం ఎత్తివేయడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతో ఈ పథకాల కింద ఆర్థిక సాయం కోసం ఎదురుచూ స్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఊరట లభించింద న్నారు. వివాహ సమయం లో పేద కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం వారి కష్టాలను కొంతమేర తగ్గిస్తుందని తెలిపారు. స్టే కారణంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును త్వరి తగతిన పరిష్కరించి, లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా చూడాలని, దరఖాస్తుల పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టు స్టే విధించిన సందర్భంలో కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
కోర్టు విధించిన స్టేను పథకాల రద్దుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. న్యాయ స్థానం ప్రక్రియను వక్రీక రించి ప్రజల్లో అపోహలు, గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనా లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు తలెత్తినప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నాయ కులు సంతోషం వ్యక్తం చేయడం ఎందుకని మంత్రి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని* పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ అధికారులు వేగంగా పరిశీలించాలని, అర్హత ఉన్న లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సాయం అందించాలని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
Telangana High Court, Kalyana Lakshmi Scheme, Shaadi Mubarak Scheme, Telangana Government, Minister Ponnam Prabhakar, High court, Telugu One, Telugu news


