రాష్ట్రానికి చేరిన తెలంగాణ బిల్లు

 

 

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపించారు. రాష్ట్రపతి, రాష్ట్ర అసెంబ్లీకి ఆరు వారాల గడువు ఇచ్చారనీ, ఈలోగా శాసనసభ, రాష్ట్ర విభజనపై అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపాలని రాష్ట్రానికి బిల్లును పంపుతూ ఆదేశాలు జారీ చేశారనీ తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి నిన్న సాయంత్రమే టి. ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్‌కి పంపించారన్నది ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపించింది.