వైసీపీ పుట్టుకకు కారణం అదే

 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్.. జగన్, కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. ఏపీపై పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న కోరికే వైసీపీ పుట్టుకకు కారణం తప్ప ఆ పార్టీకి సిద్ధాంతాలేమీ లేవని విమర్శించారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. నదుల అనుసంధానం, పోలవరం, పట్టిసీమపై జగన్‌ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఓట్లు, సీట్లు లేని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. పోలవరం ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కేసీఆర్‌ వెనక్కి తీసుకుంటారా?అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. మోదీ నమ్మకద్రోహం చేశారన్నారు. మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్‌, జగన్‌ పనిచేస్తున్నారని, మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడానికే కేసీఆర్‌, జగన్‌ కలిశారని విమర్శించారు.