ఏపీకి రైల్వేజోన్ కూడా రానట్టేనా..!

 

ఒక పక్క ఏపీకి రైల్వే జోన్ కావాలని నేతలు పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అమర్ నాథ్ అనే వ్యక్తి దీక్ష చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలో రైల్వో జోన్ పై రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుకు పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. విభజన చట్టం ప్రకారం ఏపీకి రైల్వే జోన్‌ రావాల్సి ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల రైల్వే శాఖ వివక్ష చూపడం లేదని, గత బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాలకు నిధులు గణనీయంగా పెంచినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరి ఏపీకి రైల్వే జోన్ కూడా వచ్చే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది.