TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైనర్ బాలిక మృతి కేసులో యువకుడి ఆత్మహత్య..!

Published on: Tue Sep 1, 2026 9:18PM

 

హైదరాబాద్ చంపాపేట,సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక మృతి కేసులో జైలుకు వెళ్లి మూడు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన మహేష్‌ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలిక మృతి కేసులో తనపై అనవసరంగా కేసులు పెట్టారని మహేష్‌ తీవ్ర ఆవేదనకు గురైనాడు. తనకు సంబంధం లేని వ్యవహారంలో కేసు నమోదు చేసి జైలుకు పంపించారని కుటుంబ సభ్యుల వద్ద పలుమార్లు బాధపడ్డాడు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా కేసు విషయాన్ని తలచుకుని మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైయ్యాడు. మానసిక ఒత్తిడిని భరించలేక మహేష్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ నేపథ్యంలోనే మహేష్ ఆత్మహత్యకు ముందు తన తండ్రికి ఎస్ఎంఎస్‌ పంపించారు. మన మీద తప్పుడు కేసులు పెట్టారని, తన చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్టొద్దంటూ తండ్రికి సందేశం పంపించి, అనంత రం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహేష్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ తండ్రికి పంపిన ఎస్ఎంఎస్‌ ఇప్పుడు కీలకంగా మారింది. 

అందులో పేర్కొ న్న అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలిక మృతి కేసులో తనపై అనవసరంగా కేసులు పెట్టారని మహేష్‌ ఎందుకు భావించాడు?  అతడి ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. అతడి ఫోన్‌లోని మెసేజ్‌లు, ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడాడు, కుటుంబ సభ్యులకు ఏమైనా చెప్పాడా అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

Singareni Colony, Champapet, Hyderabad police, Crime news,  CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Hyderabad police, Telugu One, Telugu news