టాలీవుడ్ హీరోయిన్ అరెస్టు

 

ఎర్రచందని కేసులో సినీనటి నీతూ అగర్వాల్‌‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నీతూ అగర్వాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈమెను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా వున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కేసులో ఇప్పటికే అరెస్టయిన మస్తాన్‌వలీలో ఈమె సహజీవనం చేస్తోంది. మస్తాన్ వలీ నిర్మించిన ‘ప్రేమ ప్రయాణం’ సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది. మస్తాన్ వలీ కర్నూలు జిల్లా చాగలమర్రు ఎంపీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో మస్తాన్ వలీకి సహకరించడంతోపాటు ఆర్థిక లావాదేవీల్లో కూడా ఆమె పాత్ర వున్నట్టు తెలుస్తోంది. మస్తాన్ వలీ ఆమెను మూడో వివాహం చేసుకున్నాడని కూడా వినిపిస్తోంది. మస్తాన్ వలీని అరెస్టు చేసిన తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి నీతూ అగర్వాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.