రాజీవ్ హంతకుల విడుదలపై సుప్రీం కోర్టు స్టే

 

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడులోని ఏఐడీఎంకే ప్రభుత్వం తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసానికి నివేదించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ రాజీవ్ హంతకులు జైల్లోనే వుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం‌ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును ప్రతిపాదించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ కేసులో ఉత్పన్నమైన ధర్మసందేహాలను రాజ్యాంగ ధర్మాసనానికి సమర్పించింది. ఈ కేసులో ముందుగా మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చడం, అనంతరం వారిని విడుదల చేయాలని నిర్ణయించడం వంటి అంశాలను బెంచ్ ధర్మాసనం ముందుంచింది. ఎవరైనా హంతకులను విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమా లేక కేంద్ర ప్రభుత్వమా అనేది నిర్థారణ చేయాలని కోరింది.