ప్రధాని తల్లి పాచిపని చేయలేదట

ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ ఏనాడూ పాచిపని చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు, తమను పెంచడానికి తల్లి హీరాబెన్ చాలా కష్టపడిందని మోడీ చేసిన వ్యాఖ్యలపై తాము ఎంక్వైరీ జరిపామని, అయితే హీరాబెన్ ఎప్పుడూ పాచిపని చేయలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇరుగుపొరుగు ఇళ్లలో పని చేసేవారని, గిన్నెలు తోమేవారని, నీళ్లు పట్టేవారని, పాచిపని చేసిందంటూ అబద్దమాడి తన తల్లిని మోడీ అవమానించారని ఆనంద్ శర్మ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ మండిపడుతోంది, మోడీ తల్లి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతోంది.