లోహం ... కాగితం ... ఇప్పుడు ప్లాస్టిక్

యుగాల క్రితం లోహపు కరెన్సీ చలామణిలో ఉండేది. తరువాత కాగితపు కరెన్సీ చలామణిలోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ కరెన్సీ మార్కెట్లోకి విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పది రూపాయల ప్లాస్టిక్ రూపాయల నోటును ఐదు రాష్ట్రాలలో విడుదల చేయనుంది. దేశంలో విభిన్న వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉన్న కోచీ, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాలలో మొదట వీటిని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మంగళవారం రాజ్యసభలో తెలిపారు. వందకోట్ల పదిరూపాయల నోట్లను విడుదల చేస్తామని తెలిపారు. నకిలీ నోట్లను నిరోధించడానికి, నోట్ల జీవితకాలాన్ని పెంచడమే వీటి ధ్యేయమని తెలిపారు.