ఇవాళ్టీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టీ నుంచి ప్రారంభంకానున్నాయి. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు, యూరీ ఉగ్రదాడీ, కశ్మీర్ అల్లర్లు వంటి అంశాలపై ప్రతిపక్షం, అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైంది. యూరీ ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దానికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. జాతి ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం సరైనదే అయినా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాల్లో పైచేయి సాధించేందుకు అధికార, విపక్షాలు ఎత్తులు, పై ఎత్తులతో రెడీ అవ్వడంతో పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి.