ఒడిసాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌

 

ఒడిసాలో మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఒడిసాతో పాటు చ‌త్తీస్‌గ‌డ్‌ల‌తో వ‌రుస దాడుల‌తో రెచ్చిపోతున్న మావోయిస్టుల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శ‌నివారం ఆంద్రా ఒడిసా స‌రిహాద్దులో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్లో 13 మంది మావోలు మ‌ర‌ణించారు. మ‌రో మావోయిస్టు పోలీసుల‌కు దొరికాడు.

ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా  సిలాకోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్‌సింగ్ ఎస్‌వోజీ, డీవీఎఫ్ బలగాల‌తో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో పోలీసుల మావోయిస్ట్‌ల మ‌ధ్య ఎదురు కాల్పుల జరిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్లో 13 మంది న‌క్సల్స్ చ‌నిపోగా 12 తుపాకులు, ఒక పిస్టల్, ఒక ఏకే-47, రెండు రాకెట్ లాంచర్లు, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే చనిపోయిన మావోలు  బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన మావోల‌లో మ‌న రాష్ట్రానికి చెందిన ప్రమీలా అలియాస్ జిలానీ బేగం కూడా ఉన్నట్టు స‌మాచారం.