TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నయీమ్‌ హత్య కేసులో 8 మంది అరెస్ట్.!

Published on: Wed Sep 16, 2026 2:47PM

హైదరాబాద్‌ నాగోల్‌ బండ్లగూడలో జరిగిన ఎండీ నయీమ్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక ఉన్న పాత కక్షలు, బెదిరింపుల వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను  అరెస్ట్‌ చేశారు. అయితే ఈ హత్యకు ప్రధాన నిందితుడిగా గుర్తించిన కనకం ఉమా మహేష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నయీమ్‌ హత్యకు నిందితులు ముందుగానే పథకం రచించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు ముందు ఖమ్మంలో నిందితులు సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే హత్యకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుని.. అనంతరం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత పథకం ప్రకారం నయీమ్‌పై దాడికి పాల్పడ్డారు. నయీమ్‌పై దాడి చేసిన తీరు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. ముందుగా నయీమ్‌ కళ్లలో కారం పొడి చల్లిన నిందితులు.. అతడిని వెంబడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వేట కొడవలితో నయీమ్‌ తల, చేతిపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా.. ఇనుప పెనంతో తలపై బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. వరుస దాడులతో తీవ్రంగా గాయపడిన నయీమ్‌.. ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.కే

సు దర్యాప్తులో భాగంగా నిందితులు హత్యకు ఉపయోగించిన  వేట కొడవలి, ఇనుప పెనం, సుత్తి మొదలగు ఆయుధాలనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే నిందితులు ఉపయోగించినట్లు గుర్తించిన టయోటా కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు ప్రధాన నిందితుడిగా కనకం ఉమా మహేష్‌ తో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.హత్యకు ముందు జరిగిన సమావేశం నుంచి.. హత్య అనంతరం నిందితులు ఉపయోగించిన వాహనాలు, ఆయుధాల వరకు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా మరోవైపు మృతుడు నయీమ్‌పై గతంలో పలు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షలు, బెదిరింపులే ప్రస్తుత హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఘటన నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు రౌడీషీటర్లు, పాత నేరస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

[Nayeem Murder Case, Police, Arrest, Eight, Prim ,Accused, Obscanding]