నేడు కిర్లంపూడికి చిరంజీవి...

తునికి ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తనున్నాయి. చిరంజీవి, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు... తదితర కాపు ప్రముఖులంతా నేడు కిర్లంపూడికి ప్రయాణం కడుతున్నారు. వీళ్ల రాకతో ఉద్యమంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని పోలీసు అధికారులు ఉద్విగ్నంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి, తన వర్గంవారి అంచనాలని అందుకోలేకపోయారన్న విమర్శను మూటగట్టుకున్నారు. మరి తిరిగి వారి నమ్మకాన్ని తిరిగి చూరగొనేందుకు చిరంజీవి సంచలనాత్మక ప్రకటన ఏదన్నా చేస్తారేమో! ఇక తన దగ్గర చాలా సంచలన విషయాలున్నాయంటూ తరచూ ఊరించే దాసరి, ఇవాళ కూడా తనదైన శైలిలో ప్రభుత్వం మీద విరుచుకుపడే అవకాశం ఉంది.