కంటతడి పెట్టిన మోడీ.. టీలు అమ్మేవాడిని


 

ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోడీ ఒక సందర్బంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అందరూ ఆశ్యర్యపోయారు. జుకర్ బర్గ్.. ప్రధాని మోడీని ప్రశ్నలు వేస్తుండగా అందుకు మోడీ కూడా సమాధానం చెప్పారు. అయితే జుకర్ బర్గ్ కుటుంబాల విషయంలో మీకూ మాకూ ఒకేలాంటి పరిస్థితులు ఉంటాయి కదా అని ప్రశ్నించిన నేపథ్యంలో మోడీ తన బాల్యం గురించి వివరించారు. తమది చాలా పేద కుటుంబమని.. అందరి కుటుంబాలలో మాదిరిగానే మా కుటుంబంలో కూడా మమ్మల్ని పెంచడంలో మా తల్లి దండ్రులు కీలక పాత్ర పోషించారని అన్నారు. అంతేకాదు నేను బాల్యంలో టీలు అమ్మేవాడిని.. నాతల్లి మమ్మల్ని పోషించడానికి పక్క ఇళ్లలో పనులు చేసేదని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టేశారు. ఇప్పటికీ నా తల్లి తన పనులు తానే చేసుకుంటుందని ఇప్పుడు ఆమెకు 90 ఏళ్లు అని చెప్పారు. అయితే వెంటనే తేరుకొని మోడీ జుకర్ బర్గ్ పై ప్రశంసలు కురిపించారు. వేదిక వద్ద ఉన్న తన తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ అబ్బాయి ప్రపంచ దృష్టినే మార్చేశాడు’’ అని.. అందరూ కనిపించేలా వారిని లేచి నిలుచోవాలని కోరారు.