రియల్ బిచ్చగాడు..

అతడు కోటీశ్వరుడు. కానీ కూటికి చేతి చాస్తూ బిక్షాటన చేస్తున్నాడు. అతనికి ఉన్న అలవాటే అతన్నిబిచ్చగాడ్ని చేసింది. చివరికి గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు రమేష్ యాదవ్ ని తన ఇంటికి తీసుకెళ్లారు.. రమేష్ ఇంటిని చూసిన అధికారులు ఆశ్యర్యపోయారు.  

దీనబంధు పునరావాస యోజన పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు ఫిబ్రవరి 24న ఒక ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించారు.   సంయుక్తంగా అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి పునరావాసం కల్పించే పనులను చేపట్టారు.ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వారికి  తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులకు బిచ్చగానిగా మారిన రమేష్ అనే కోటీశ్వరుడు తారసపడ్డాడు. 

రెండేళ్లుగా రమేష్ ఒక ఆలయం దగ్గర బిచ్చగానిగా కాలం గడుపుతున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు వారు రమేష్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలోని హంగులను చూసిన వారు తెగ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే రమేష్‌కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది. రమేష్ కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు. రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. దీంతో రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.