వైకాపాతో రాజీకొచ్చిన కొణతాల వర్గం
posted on Aug 17, 2013 10:15AM
దాడి వీరభద్రరావు చేరికతో వైకాపాకు దూరమయిన కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ లేదా తెదేపాలో చేరుతారని అందరూ ఊహించారు. అయితే, ఆయన మాత్రం అటువంటి ప్రయత్నాలేవీ చేసినట్లు కనబడలేదు, కానీ ఇంతకాలం పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే, ఈ నెల 19నుండి వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయవాడలో విజయమ్మ చేపట్టే దీక్ష చేపట్టబోతున్న సందర్భంగా, ఆమెకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేపట్టాలని, అదేవిధంగా ఈ నెల 22 నుంచి పార్టీ నిర్వహించే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలకి పిలుపునిచ్చారు. అంటే, ఆయన దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేయడానికి కూడా సిద్దపడినట్లే భావించవచ్చును. ఇది పార్టీకి, అయన ప్రత్యర్ధులకు కూడా ఊహించని పరిణామమే. బహుశః కొణతాల వర్గం ప్రస్తతం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో కేవలం తాత్కలికంగా వెనక్కి తగ్గి ఉండవచ్చును. ఎన్నికలు దగ్గరపడిన తరువాత ఆయన వర్గం పార్టీ మరే అవకాశం ఉంది.