ఢిల్లీ లిక్కర్ స్కాం.. చార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం పేరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా రెండో చార్జిషీట్ దాఖలు చేసింది.

ఈ  చార్జీషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ పేరు చేర్చింది. అలాగే రెండో చార్జిషీట్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌తో పాటు మరో 17 మందిపై కూడా ఈడీ అభియోగాలు మోపింది.

లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ పేరు చేర్చటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  మొదటి నుంచీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగానే ఉంది.