రాబోయే 10 గంటల్లో ప్రచండ గాలులు, భారీ వర్షం.. ఈ 19 రాష్ట్రాల ప్రజలు జాగ్రత్త!
Published on: Wed Aug 26, 2026 10:52AM
(11).webp)
భారతదేశ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం, దేశంలోని ఏకంగా 19 రాష్ట్రాల్లో రాబోయే కొన్ని గంటల్లో తీవ్రమైన వర్షాలు, ఈదురుగాలులు మరియు ఉరుములతో కూడిన మెరుపులు విజృంభించనున్నాయి. జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో రెండు వేర్వేరు వెదర్ సిస్టమ్లు ఒకేసారి క్రియాశీలకంగా మారడం వల్ల ఈ భారీ వర్షపాతం నమోదు కానుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గంటకు 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తూర్పు భారతదేశంలో పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలతో పాటు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు తీవ్ర అప్రమత్తత పాటించాలని ఐఎండి సూచించింది. పర్వత ప్రాంతాలకు ప్రయాణించే పర్యాటకులు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని అధికారులు తేల్చి చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభించి ఉత్తర, తూర్పు మరియు మధ్య భారత రాష్ట్రాల వరకు ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఢిల్లీ-ఎన్సిఆర్ పరిధిలో మేఘావృతమైన ఆకాశంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ మధ్యస్థ స్థాయి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. గత 24 గంటల్లోనే ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు ఆయా నగర్ వంటి ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీనివల్ల నగరంలో ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల వరకు దిగివచ్చి వాతావరణం చల్లబడింది. ఢిల్లీ వాసులు ఉదయం వేళ నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో రాబోయే 3 రోజుల పాటు వర్ష ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. బీహార్లోని పాట్నా, గయా, వైశాలి, ముజఫర్పూర్, దర్భంగా, మధేపురా, భాగల్పూర్ మరియు పూర్ణియాతో సహా మొత్తం 19 జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్లు జారీ చేయబడ్డాయి. బీహార్ పరిధిలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడే ప్రచండ గాలులతో పాటు తీవ్రమైన ఆకాశ విద్యుత్ లేదా పిడుగులు పడే అవకాశం ఉనందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. పాట్నాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదు కానుంది. యూపీలో కూడా తూర్పు ప్రాంతాల్లో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
delhi bihar heavy rainfall thunderstorm warning,imd weather update 19 states rain alert.


