బేగంబజార్లో కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాలతో గణనాథుడు..!
Published on: Mon Sep 14, 2026 5:03PM

వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్లోని ఫీల్ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా మూడు న్నర కిలోల బంగారం, మూడు లక్షల వజ్రాలతో రూపొందించిన భారీ బంగారు విగ్రహాన్ని ఫీల్ఖానాలో ఏర్పాటు చేశారు.ఈ అద్భుతమైన విగ్రహం తయారీ కోసం ఎనిమిది నెలల పాటు 16 మంది కార్మికులు శ్రమిం చారు. ఎంతో నైపుణ్యంతో బంగారం, వజ్రాలను ఉపయోగించి రూపొం దించిన ఈ విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరొందిన బేగంబజార్లోని ఫీల్ఖానాలో ఏర్పాటు చేసిన ఈ బంగారు-వజ్రాల విగ్రహం.. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో హైలెట్గా నిలవనుంది. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.మూడు న్నర కిలోల బంగారం.. మూడు లక్షల వజ్రాలు.. ఎనిమిది నెలల శ్రమ.. 16 మంది కళాకారుల నైపు ణ్యం.. ఇవన్నీ కలగలిసి రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక గణనాథుడు బేగంబజార్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
[ Ganesha with gold and diamonds in Begum Bazaar, Feelkhana, Vinayaka Chavithi 2026, Khairatabad Ganesh Puja, Telangana News, Ganesh Utsav Celebrations ]


