యువత చేతిలోనే నేతల తలరాతలు

 

చిత్తూరు జిల్లాలో యువతీ యువకులే రాజకీయాలను నిర్దేశించబోతున్నారు. వీళ్లు నూటికి నూరుశాతం ఓట్లు వేస్తే.. పార్టీల జాతకాలు తారుమారు కావడం ఖాయం. యువతరం మనస్సు దోచుకున్న నేతలు తాము ఆశించిన స్థానం దక్కించుకోవడమూ ఖాయం. ఈ ఏడాది జనవరి నాటికి చిత్తూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 29,00,500 కాగా అందులో 18 నుంచి 39 సంవత్సరాల వారు 16,15,860 మంది. అంటే సగానికి పైగా ఓటర్లు యువతేనని స్పష్టం అవుతోంది. వీరిలో 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 71,156 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో యువత తీసుకునే నిర్ణయం అభ్యర్థులతో పాటు ఆయా రాజకీయపార్టీల తలరాతలను నిర్దేశించబోతోంది.