ఢిల్లీ కాలుష్యం... ఎవరూ బయటకు రావద్దు..


దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వందల స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు ఈ కాలుష్య నివారణ చర్యలను సైతం చేపట్టింది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు కళ్లల్లో మంట, శ్వాసకోశ సమస్యలకు గురవుతుండటంతో ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్పించి.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించింది. గాలిలో దుమ్మ, ధూళి శాతాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేశారు.