కళకళలాడుతన్న రాజధాని... తాత్కాలిక సచివాలయం ప్రారంభం

 

హైదరాబాద్ నుండి ఏపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27 నాటికి ఏపీ ఉద్యోగులందరూ ఏపీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందరూ రాజధానికి తరలివస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రాజధాని చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని పరిధిలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాకును ప్రారంభించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు కొబ్బరికాయకొట్టి బ్లాకు ప్రారంభించారు. దీంతో ఉద్యోగుల రాకతో రాజధాని కళకళలాడిపోతుంది