ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అలాగే చట్టసభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సభ తీర్మానించింది. సభలో చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అధికార పార్టీ సభ్యులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని, అధికార పార్టీ సభ్యులందరూ కౌరవుల మాదిరిగా వున్నారని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు అడపా దడపా జగన్‌కి చురకలు అంటించారు. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు జరిగాయి. 60 గంటల 37 నిమిషాలపాటు సభ జరిగింది. 41 మంది సభ్యులు మాట్లాడారు. 5 బిల్లులను ఆమోదించారు. 117 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది.