కేంద్ర నిర్ణయం.. దేశమంతటా ప్రైవేట్ అవ్వనున్న ఎయిర్ పోర్టులు

 

ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ పూర్తయ్యింది. ఆ దిశగానే మరి కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారణాసి సహా దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్నో, అహ్మదాబాద్, జయపుర, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయులను నిర్వహణ అభివృద్ధి కార్యకలాపాల కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని డబ్ల్యుఎఫ్ఐ ప్రతిపాదించింది. 

ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేశారు. వాటితో పాటు అమృతసర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయిపూర్, తిరుచి విమానాశ్రయా లను కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని సెప్టెంబర్ 5న జరిగిన బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బోర్డు నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించారు. నిజానికి దేశ వ్యాప్తంగా డబ్ల్యుఐఐ వందకు పైగా విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. మొదటి దశ ప్రైవేటు పరంలో భాగంగా అదాని గ్రూప్ ఆరు విమానాశ్రయాల నిర్మాణ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దీనికి జులై 3న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్, లక్నో, మంగుళూరు విమానాశ్రయాల నిర్వహణను అదానీ సంస్థకు అప్పగించారు. మరో మూడింటిని అప్పగించాల్సి ఉంది. మొత్తానికి భారత్ లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ పై అటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం దూకుడుగానే వెలుతున్నాయి. అయితే దేశంలోని అన్ని విమానాశ్రయాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి మాత్రం ఇంకొంచెం సమయం పట్టే అవకాశముందని సమాచారం.