TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏడి జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు..!

Published on: Thu Aug 27, 2026 10:52AM

 

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) జయరాజు ఇళ్లు, ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భూపాల్‌పల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లో మొత్తం  12 చోట్లఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయ వనరులు, స్థిరాస్తులు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలు, లెక్కల్లో తేడాలపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు సోదాలు ముగిసిన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

ACB searches at ED Jayarajus homes, Bhupalapally District, Department of Underground Mines, ACB DSP Sambaiah, CM Revanth reddy, Telugu news, Telugu one