వైఎస్ షర్మిలపై కేసు నమోదు 

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు . మే 2వ తేదీన బద్వేల్‌ బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ 168 , ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు .కాగా, ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల.. వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పీఎస్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, షర్మిలపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు సహా విపక్ష పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా వైసీపీ నేతల ప్లాన్ అని మండిపడుతున్నారు.