TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శిల్పారామంలో 19 నుంచి ‘మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో’..!

Published on: Thu Sep 17, 2026 5:40PM

తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ‘మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో’ నిర్వహించను న్నట్లు తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) సి. గోపికన్నన్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పూంపు హార్ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు రూపొందించిన అరుదైన, ఆకర్షణీయమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడంతో పాటు కళాకారులకు మార్కెట్‌ను కల్పించడం, తమిళనాడు హస్తకళల గొప్ప వారస త్వాన్ని ప్రజలకు పరిచయం చేయడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని గోపికన్నన్ వివరించారు. 

ఈ నెల 19న ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమం జరగనుంది. తమిళనాడు ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పి. మధన్ రాజా ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి తమిళ నాడు హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. అమృత జ్యోతి హాజరు కాను న్నారు. ఎక్స్‌పోలో తమిళనాడు కళాకారుల ప్రతిభకు అద్దం పట్టేలా విభిన్న రకాల హస్తకళా ఉత్పత్తులు అందుబాటు లో ఉండనున్నాయి. కాంస్య విగ్రహాలు, ఇత్తడి సంప్రదాయ దీపాలు, తంజావూరు చిత్రాలు, తంజావూరు ఆర్ట్ ప్లేట్లు, పేపియర్-మాచే బొమ్మలు, చెక్క శిల్పాలు, రాతి శిల్పాలు, ఇత్తడి కళాఖం డాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

అలాగే మట్టి, టెర్రకోట ఉత్ప త్తులు, చెరకు/కేన్ ఫర్నిచర్, అరటి నార ఉత్పత్తులు, జనపనార (జ్యూట్) ఉత్పత్తులు, తాటి ఆకులతో తయారు చేసిన వస్తువులు, ఫ్యాషన్ ఆభరణాలు, ధూప ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు కూడా ప్రదర్శన లో అందుబాటులో ఉంటాయి. చేతితో తయారు చేసిన వస్త్రాలు, చేనేత ఉత్పత్తులతో పాటు మరెన్నో సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను ఈ ఎక్స్‌పోలో సందర్శకులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని గోపికన్నన్ తెలిపారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగు తున్న కళలు, కళాకారుల నైపుణ్యాన్ని ఒకే వేదికపై చూడటానికి ఈ ప్రదర్శన అవకాశం కల్పిస్తుందని గోపికన్నన్ పేర్కొన్నారు.

 

 

 

[ Mega Handicrafts Expo, Tamil Nadu, Shilparam, Crafts, Minister P. Madhan Raja, Telangana goverment, CM Revanth reddy, TeluguOne News ]